తెలుగు చలనచిత్ర రంగంలో మాత్రమే దక్షిణాది రంగంలో అందాల నటి సావిత్రి నట జీవితం ఒక సంచలనం అని చెప్పవచ్చు. ఎన్టీఆర్ నాటి దిగ్గజ నటించిన సావిత్రి.. తన జీవిత చివరి దినాలలో అనేక దుర్భరమైన పరిస్థితులు అనుభవించారు. రంగుల ప్రపంచంలో తిరుగులేని క్రేజ్ ఉన్న సావిత్రి జీవితాన్ని “మహానటి” అనే టైటిల్ తో బయోపిక్ సినిమాగా చిత్రీకరించడం తెలిసిందే. 2018 వ సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా రికార్డు స్థాయి వసూలు రాబట్టింది. సావిత్రి పాత్రలో హీరోయిన్ కీర్తి సురేష్ ఇట్టే ఒదిగిపోయింది. అచ్చు గుద్దినట్లు సావిత్రి హావ భావాలను తెరపై కీర్తి సురేష్ తన నటనతో పండించిన విధానం సినిమా ఇండస్ట్రీలో మహామహులకు ఆశ్చర్యాన్ని కలిగించింది.
ఈ సినిమాతో కీర్తి సురేష్ జాతీయా అవార్డు కూడా దక్కించుకోవడం తెలిసిందే. కీర్తి సురేష్ కి ఈ సినిమా ఎంతో పేరు తెచ్చిపెట్టింది. నాగ అశ్విన్ దర్శకత్వంలో దొరికిన ఈ సినిమా వైజయంతి మూవీస్ బ్యానర్ నిర్మించడం జరిగింది. ఈ క్రమంలో తాజాగా మహానటిలో జూనియర్ ఎన్టీఆర్ నీ తీసుకోకపోవటానికి గల కారణం గురించి వైజయంతి నిర్మాణ సంస్థ అధినేత అశ్విని దత్ లేటెస్ట్ ఇంటర్వ్యూలో తెలియజేశారు. వాస్తవానికి సీనియర్ ఎన్టీఆర్ పాత్రని జూనియర్ ఎన్టీఆర్ తో చేయిద్దామని అనుకున్నాం.
కానీ అదే సమయంలో బాలకృష్ణ “ఎన్టీఆర్ బయోపిక్” ప్రకటించారు. దీంతో అటువంటి పరిస్థితుల్లో మా సినిమాలో ఎవరిని పెట్టి తీసిన తప్పుగా భావిస్తారనిపించింది. ఇక జూనియర్ ఎన్టీఆర్ ని పెట్టిన బాగుండదునుకున్నాం. ఈ పరిణామంతో అసలు స్క్రిప్ట్ లో ఎన్టీఆర్ పాత్ర లేకుండానే సినిమా తీస్తానని నాగ్ అశ్విన్ అనటం ఆ తర్వాత సినిమా తీయటం జరిగిందని సరికొత్త విషయాన్ని తెలియజేశారు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!