ఇండస్ట్రీలో మంచి మనసున్న హీరోగా అనేక మంది స్నేహితులు కలిగిన హీరోగా పేరున్న వాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. “బాహుబలి” సినిమా తో దేశవ్యాప్తంగా తో పాటు ప్రపంచ వ్యాప్తంగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. అటువంటి ప్రభాస్ తన జీవితంలో మర్చిపోలేని సాయం చేసిన వ్యక్తి చనిపోతే ఆయన చేసిన సాయం ఇప్పుడు సోషల్ మీడియాలో ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తుంది. పూర్తి విషయంలోకి వెళ్తే 16 సంవత్సరాల క్రితం అనగా 2004 సంక్రాంతి పండుగకు ప్రభాస్ నటించిన “వర్షం” సినిమా రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాతో ప్రభాస్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా నిలదొక్కుకున్నాడు. అటువంటి హిట్టిచ్చిన “వర్షం” డైరెక్టర్ శోభన్ మృతి చెందిన తర్వాత ఆయన కుటుంబాన్ని చాలా వరకు ప్రభాస్ ఆదుకుంటూ సాయం చేస్తూ వస్తున్నారు. ఇదిలా ఉండగా దివంగత శోబన్ కొడుకు సంతోష్ శోభన్ ఇప్పుడు హీరోగా ప్రేక్షకుల ముందుకు రావటానికి ఆరాటపడుతున్నాడు. సంతోష్ శోభన్ బరువు బాధ్యతలు చాలావరకు ఆయన తండ్రి చనిపోయాక ప్రభాస్ దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో తన సొంత బ్యానర్ లాగా ఫీల్ అయ్యే యువి క్రియేషన్స్ బ్యానర్లో సంతోష్ శోభన్ ని హీరోగా పెట్టి సినిమా నిర్మించడానికి ప్రభాస్ రెడీ అయ్యాడు.
గతంలోనే సంతోష్ శోభన్ తాను నేను, పేపర్ బాయ్ అనే సినిమాలు చేయడం జరిగింది. అవి పెద్దగా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయాయి. దీంతో సంతోష్ కి ఎలాగైనా హిట్ ఇవ్వాలని తానే నిర్మాతగా బ్యాక్ గ్రౌండ్ లో ఉంటూ ప్రభాస్ తన కెరియర్ ని నిలదొక్కుకునేలా చేసిన డైరెక్టర్ కొడుకుకి ఈ విధంగా చేసిన మేలు పొందిన సాయం మర్చిపోకుండా సహాయం చేస్తున్నాడు. దీంతో ఈ వార్త విని చాలా మంది నెటిజన్లు అందుకే ప్రభాస్ అంటే ఫ్యాన్స్ పడి చస్తారు అని కామెంట్లు పెడుతున్నారు.