RRR: “RRR” మార్చి 25 వ తారీకు రిలీజ్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో… పాటు సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇండియాలో విడుదలైన ప్రతి చోట రికార్డు స్థాయి కలెక్షన్ల తో దూసుకుపోతూ… ఆయా ఇండస్ట్రీలలో సరికొత్త లెక్కలు సెట్ చేస్తూ ఉంది. వీకెండ్ లతో సంబంధం లేకుండా “RRR” చూడటానికి సినిమా ప్రేమికులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఒకపక్క ఐపీఎల్ సీజన్ మొదలైన గాని “RRR” కలెక్షన్లకు ఏ మాత్రం డోకా లేకుండా వస్తూ ఉండటంతో… ఓవరాల్ రన్ టైం లో.. ఎంత సాధిస్తుందో అని అందరు ఆసక్తిగా గమనిస్తున్నారు.
ముఖ్యంగా రాజమౌళి దమ్మెంతో మరోసారి ఈ సినిమా రుజువు చేసిందని చూసిన సెలబ్రిటీలు అభినందిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా సక్సెస్ వేడుక ఇటీవల ముంబైలో జరగడం తెలిసిందే. ఈ వేడుకకు డాక్టర్ రాజమౌళి తో పాటు ఇద్దరు హీరోలు చరణ్.. ఎన్టీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలీవుడ్ మీడియా “RRR” సీక్వెల్ గురించి ప్రశ్నలు వేశారు. దానికి రాజమౌళి సమాధానమిస్తూ.. కాలమే నిర్ణయిస్తుంది అని తెలిపారు. సీక్వెల్ చేయాలని.. నాకు ఉంది పైగా కథ బట్టి కాదు మరోసారి చరణ్ తారక్ తో పనిచేయడం కోసమైనా సీక్వెల్ రావచ్చేమో.. గ్యారెంటీ ఇవ్వలేను అంటూ జక్కన్న చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటే ఇదే సీక్వెల్ వార్తపై స్టోరీ రైటర్ విజయేంద్రప్రసాద్ కూడా రియాక్ట్ కావడం జరిగింది. తారక్ తో పాటు మరి కొంత మంది తో డిస్కషన్ చేసినట్లు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు విజయేంద్రప్రసాద్ కామెంట్లు చేశారు. తారక కూడా కొమరం భీమ్ రామరాజు కలిశాక ఏం జరిగింది అన్నదానిపై…”RRR” సీక్వెల్ చేస్తే బాగుంటుంది అని.. అన్నట్లు వార్తలు వచ్చాయి. ఏది ఏమైనా “RRR” సీక్వెల్ కాలమే నిర్ణయిస్తుందని ముంబైలో సక్సెస్ మీట్ లో… జక్కన్న కామెంట్ చేయటం..తో.. నందమూరి మెగా అభిమానుల లో కొద్దిగా ఆశలు చిగురిస్తున్నాయి.