Samantha Ruth Prabhu: హీరోయిన్ సమంత మయోసిటీస్ అనే ప్రాణాంతకర వ్యాధితో బాధపడుతున్నట్లు సోషల్ మీడియా ద్వారా పోస్ట్ పెట్టి అందరికీ షాక్ ఇచ్చింది. గత కొద్ది నెలల నుండి సమంత ఆరోగ్యం పై రకరకాల వార్తలొస్తున్నాయి. సమంత చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు.. అందువల్లే అమెరికా వెళుతున్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ వచ్చిన వార్తలను సమంత టీం కొట్టి పడేసింది. ఇలాంటి తరుణంలో శనివారం మధ్యాహ్నం తనకి మయోసిటీస్ అనే ప్రాణాంతకార వ్యాధి వచ్చినట్లు తెలపడం సంచలనం రేపింది.
సమంత పెట్టిన పోస్ట్ ఎలక్ట్రానిక్ మరియు సోషల్ మీడియా రంగంలో వైరల్ గా మారింది. గత ఏడాది అక్టోబర్ నెలలో నాగచైతన్యతో విడాకులు తీసుకోగా ఈ అక్టోబర్ లో సమంత .. ఈ అరుదైన వ్యాధికి గురికావడం పట్ల ఆమె అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో సమంత పెట్టిన ఈ పోస్ట్ పట్ల ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు మరియు అభిమానులు రియాక్ట్ అవుతున్నారు.
సినిమా ఇండస్ట్రీ నుండి చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కొణిదెల, మంచు లక్ష్మి, రాశి కన్నా, శ్రీయన్, కృతి సనన్, ఎన్టీఆర్, అక్కినేని అఖిల్, నందిని రెడ్డి, కియారా అద్వానీ, లావణ్య త్రిపాటి, హన్సిక, జాహ్నవి కపూర్, సోనాలి చౌహాన్, మాళవిక, అక్కినేని సుశాంత్, జెనీలియా, సౌందర్య, దీప్తి సునయన, అఖిల్ సార్దిక్, రితీష్ దేశ్ ముఖ్ ఇంకా పలువురు సెలబ్రిటీలు కామెంట్ల రూపంలో సమంతకి ధైర్యం చెప్పడం జరిగింది. అక్కినేని కుటుంబం నుండి అఖిల్ మరియు సుశాంత్ ఇద్దరు ధైర్యంగా ఉండాలని కచ్చితంగా నువ్వు ఈ వ్యాధి ని జయిస్తావని కామెంట్లు పెట్టడం విశేషం.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!