దక్షిణాది సినిమా రంగంలో సూపర్ స్టార్ రజనీకాంత్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏ హీరోకి లేని రీతిలో మాస్ ఫాలోయింగ్ రజనీకాంత్ సొంతం. మనదేశంలోనే కాదు జపాన్ ఇంకా పలు చోట్ల కూడా రజనీకాంత్ కి మంచి మార్కెట్ ఉంది. రజిని సినిమా విడుదలవుతుందంటే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కూరవటం గ్యారెంటీ. జయపజయాలతో సంబంధం లేకుండా రజిని సినిమాలకు కలెక్షన్ వస్తది. చాలామంది అభిమానులు మాత్రమే కాదు ఇండస్ట్రీకి చెందిన హీరోలు ఆర్టిస్టులు కూడా రజనీకాంత్ నీ ఆదర్శంగా తీసుకుంటారు.
అటువంటి రజిని తన జీవితంలో మాత్రం ఆనందం ప్రశాంతత లేదని ఇటీవల ఒక పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. చెన్నైలో హ్యాపీ సక్సెస్ఫుల్ లైఫ్ త్రూ క్రియ యోగ అనే పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రజనీకాంత్… ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. నేను నా జీవితంలో పేరు ప్రఖ్యాతలు అన్నీ చూశాను. కానీ ఆనందం మరియు ప్రశాంతత విషయంలో 10 శాతం కూడా దక్కలేదు. ఎందుకంటే అవి శాశ్వతంగా ఉండేవి కావు. నేను గొప్ప నటుడినని అందరూ అంటుంటారు. ఇ
ది ప్రశంసో, విమర్శో అర్థం కావడం లేదు. రాఘవేంద్ర, బాబా.. ఈ రెండు సినిమాలు నాకు ఆత్మ సంతృప్తినిచ్చాయి. బాబా సినిమా చూశాక చాలామంది హిమాలయాలు వెళ్లామని చెప్పారు. నా అభిమానులు కొందరైతే సన్యాసులుగా మారిపోయారు. హిమాలయాలలో చాలా శక్తివంతమైన మూలికలు దొరుకుతాయి. అవి తింటే వారానికి సరిపడా శక్తిని ఇస్తాయి. మనిషి జీవితంలో ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం. ఒక్కసారి అనారోగ్యానికి గురైతే మనకు కావాల్సిన వాళ్ళు కూడా చాలా బాధపడతారు, తట్టుకోలేరు… అంటూ తనదైన శైలిలో రజనీకాంత్ స్పీచ్ ఇచ్చారు. ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు.