మెగాస్టార్ చిరంజీవి వరస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. రాజకీయాలనుండి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మొదటి రెండు సినిమాలు ఖైదీ నెంబర్ 150, సైరా నరసింహారెడ్డి సినిమా లకు చాలా టైం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో మెగా ఫ్యాన్స్ నుండి చిరంజీవిపై ఒత్తిడి రావటంతో వరుసగా భారీ ప్రాజెక్టులను లైన్ లో పెట్టడం జరిగింది. ప్రస్తుతం పాల శివ దర్శకత్వంలో “ఆచార్య” అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వంలో “వేదాళం” అనే తమిళ సినిమాని రీమేక్ చేయనున్నారు. ఆ తరువాత వి.వి.వినాయక్ దర్శకత్వంలో “లూసిఫర్” అనే మలయాళం మూవీ ని కూడా తెలుగులో రీమేక్ చేస్తున్నారు.
ఆ తర్వాత బాబీ దర్శకత్వంలో కూడా సినిమా చేయడానికి రెడీ అవుతూ ఇలా వరుస ప్రాజెక్టులు లైన్ లో పెట్టారు చిరంజీవి. ఇటువంటి తరుణంలో మధ్యలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో సినిమా ఉంటుందని ప్రకటించడం జరిగింది. బోయపాటి దర్శకత్వంలో “వినయ విధేయ రామ” ప్రీ రిలీజ్ వేడుకలో ఈ విషయాన్ని ఎనౌన్స్ చేయడం జరిగింది. కాగా ఇప్పుడు ఈ ప్రాజెక్టు ఆగిపోయినట్లు ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి. పూర్తి మేటర్ లోకి వెళ్తే త్రివిక్రమ్ కూడా వరస ప్రాజెక్టులతో ఉండటంతో ఇద్దరూ కలిసి ఈ ప్రాజెక్టును పక్కన పెట్టినట్లు సమాచారం.
దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో కి రావడంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ డిప్రెషన్లోకి వెళ్లిపోయారు. గతంలో చిరంజీవి ని “జై చిరంజీవ” అనే సినిమాతో త్రివిక్రమ్ దర్శకత్వం వహించడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ వీరి కాంబినేషన్ లో సినిమా ఉంటుంది అని అనేకసార్లు వార్తలు వచ్చినా గత ఏడాది అధికారిక ప్రకటన వచ్చింది. దాంతో ఫుల్ హ్యాపీ అయ్యారు మెగా ఫ్యాన్స్. ఇంతలోనే ఇప్పుడు ఈ ప్రాజెక్టు ఆగిపోయినట్లు వార్త సోషల్ మీడియాలో దర్శనమివ్వడంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా కుప్పకూలిపోయిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి స్క్రిప్ట్ వర్క్ పనుల్లో ఉన్నారు. ఆ తర్వాత అల్లు అర్జున్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ మరియు వెంకటేష్ తో సినిమాలను చేయటానికి త్రివిక్రమ్ రెడీ అవుతున్నారు. దీంతో ప్రస్తుత పరిస్థితుల బట్టి చిరంజీవితో సినిమా లేదు అనే గ్యారెంటీ టాక్ ఫిలింనగర్ లో గట్టిగా వినబడుతుంది.