Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. “స్పైడర్” సినిమా వంటి పరాజయం తర్వాత..స్టొరీ సెలెక్షన్స్ లో కేర్ తీసుకున్ని .. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటూ ఉన్నాడు. ఈ క్రమంలో స్టార్ దర్శకులతో సినిమాలు చేస్తూ టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర తన సత్తా చాటుతూ ఉన్నాడు. గత ఏడాది “సర్కారు వారి పాట” సినిమాతో అద్భుతమైన విజయం అందుకున్న మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఆగస్టు నెలలో రిలీజ్ చేసే ప్లాన్ లో మేకర్స్ ఉన్నారు. త్రివిక్రమ్ మూవీ తర్వాత రాజమౌళితో పాన్ ఇండియా ప్రాజెక్ట్ స్టార్ట్ కానుంది.
ఇదిలా ఉంటే గత ఏడాది మహేష్ పుట్టినరోజు నాడు “పోకిరి” సినిమా లేటెస్ట్ టెక్నాలజీతో రీ రిలీజ్ చేయడం తెలిసిందే. ఈ రకంగా ఫస్ట్ టైం మహేష్ ఫ్యాన్స్ సరికొత్త ట్రెండ్ సృష్టించారు. కాగా “పోకిరి” రెండోసారి రిలీజ్ అయి స్పెషల్ షోలకు అద్భుతమైన కలెక్షన్స్ అందుకోవటం జరిగింది. కాగా ఇప్పుడు తెలుగు చలనచిత్ర రంగంలో మరోసారి మహేష్ సత్తా చాటాడు. విషయంలోకి వెళ్తే ఫిబ్రవరి 18వ తారీకు శివరాత్రి నేపథ్యంలో ఆదివారం ఉదయం 3 గంటలకు “దూకుడు” స్పెషల్ షో ఏర్పాటు చేయగా.. కేవలం 120 నిమిషాల్లోనే టికెట్లు మొత్తం హాట్ కేకులా అమ్ముడైపోవడం జరిగింది.
శ్రీనువైట్ల దర్శకత్వంలో మహేష్ నటించిన ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. “దూకుడు” సినిమాలో బ్రహ్మానందం కామెడీ చాలా హైలెట్. దీంతో శివరాత్రి సందర్భంగా స్పెషల్ షోలకు మరోసారి రిలీజ్ క్రమంలో టికెట్లు మొత్తం మూడు గంటల్లో అయిపోవటం సంచలనం సృష్టించింది. ఈ విషయాన్ని మహేష్ ఫ్యాన్స్ ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ..”తెలుగు సినిమా చరిత్రలో ఇదే ఫస్ట్ టైం అని” పోస్ట్ లు పెడుతున్నారు.