Mahesh Gautham Menon: 2010వ సంవత్సరంలో విడుదలైన “ఏ మాయ చేసావే” సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా సమంత హీరోయిన్ గా సరికొత్త ప్రేమ కథతో విడుదలైన ఈ మూవీ నాగచైతన్య కెరియర్ లో ఫస్ట్ హిట్ అయిన సినిమాగా నిలిచింది. హీరోయిన్ గా సమంతకి కూడా ఈ సినిమా మొట్టమొదటి హిట్. ఈ సినిమాలో పాటలు, రొమాంటిక్ సన్నివేశాలు అప్పట్లో ఎంతగానో ఆకట్టుకున్నాయి. “ఏ మాయ చేసావే” తర్వాత హీరో నాగచైతన్య ఇంకా హీరోయిన్ సమంత కెరియర్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.
ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా దర్శకుడు గౌతమ్ మీనన్ లేటెస్ట్ గా సంచలన వ్యాఖ్యలు చేశారు. “ఏ మాయ చేసావే” స్టోరీ ఫస్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబుకి చెప్పినట్లు పేర్కొన్నారు. అయితే ఆ సమయంలో మనం కలిసి సినిమా చేస్తే యాక్షన్ సినిమా రావాలి. అలాంటి స్టోరీ ఉంటే చెప్పండి అని మహేష్ చెప్పారు. కచ్చితంగా మహేష్ బాబుతో సినిమా ఉంటుంది అని గౌతమ్ మీనన్ ఈ సందర్భంగా తెలిపారు.
నేను మహేష్ కి కథ చెబితే.. యాక్షన్ డ్రామానే చెబుతా. మా ఇద్దరి సినిమా ఎప్పుడైనా ఉండొచ్చు అని లేటెస్ట్ గా గౌతమ్ మీనన్ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇదిలా ఉంటే మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తూ ఉన్నారు. గతవారం సెప్టెంబర్ 12వ తారీకు నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 28వ తారీకు ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా అయినా వెంటనే రాజమౌళి ప్రాజెక్టులో మహేష్ బిజీ కానున్నారు. ఈ రెండు సినిమాలైనా తర్వాత గౌతమ్ సినిమా ఉండే అవకాశం ఉన్నట్లు తాజా పరిస్థితులు బట్టి తెలుస్తుంది.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!