NTR30: డైరెక్టర్ కొరటాల ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ సూపర్ డూపర్ హిట్టయ్యింది. ఎన్టీఆర్ ని చాలా కొత్తగా శివ చూపించాడు. 2016 సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. దీంతో తన కెరీర్ లో 30వ సినిమా బాధ్యతలను పూర్తిగా కొరటాల పై పెట్టడం జరిగింది. “RRR” వంటి భారీ బ్లాక్ బస్టర్ పైగా రాజమౌళి సినిమా తర్వాత చేస్తున్న సినిమా కావడంతో గ్యారెంటీగా హిట్ అవ్వాలని కొరటాల ఎన్టీఆర్ ప్రాజెక్ట్ పై చాలా హోం వర్క్ చేయడం జరిగిందట.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
మెసేజ్ ఓరియెంటెడ్ తరహాలో.. కమర్షియల్ మాస్ ఎంటర్ టైనర్ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో హీరోయిన్ విషయంలో మొదట బాలీవుడ్ టాప్ హీరోయిన్ అలియా భట్ పేరు మారుమ్రోగింది. అయితే ఇటీవల ఆమెకు పెళ్లి కావడంతో ఈ ప్రాజెక్టు నుండి తప్పుకున్నాడని వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ల విషయంలో కొరటాల మదిలో ముగ్గురు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
హీరోయిన్ సాయి పల్లవి, రష్మిక మందన, దిశా పటాని. ఈ ముగ్గురిలో ఒకరిని కన్ఫామ్ చేసే ఆలోచనలో కొరటాల ఉన్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం ఎన్టీఆర్ దాదాపు 8 కేజీల బరువు తగ్గుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. చాలా స్లిమ్ గా ఎన్టీఆర్ నీ కొరటాల శివ చూపించబోతున్నట్లు ఇండస్ట్రీ టాక్. కాగా ఇటీవల ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా చిన్నపాటి వీడియో అందులో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ తో పాటు అనిరుధ్ అందించిన మ్యూజిక్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.