బాలీవుడ్ ఇండస్ట్రీ లో tollywood ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు భారీ స్థాయిలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ వరస ఫ్లాపుల్లో ఉన్న సమయంలో మహేష్ నటించిన “పోకిరి” సినిమా బాలీవుడ్లో వాంటెడ్ సినిమాగా రీమేక్ చేసి అదిరిపోయే హిట్ అందుకుని అప్పటినుండి ఇప్పటివరకు వెనక్కి తిరిగి చూసుకోకుండా వరుస విజయాలు తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇదే తరహాలో బాలీవుడ్ టాప్ హీరో షాహిద్ కపూర్ కూడా కెరీర్ ఫుల్ డిజాస్టర్ లో ఉన్న సమయంలో “అర్జున్ రెడ్డి” సినిమా “కబీర్ సింగ్” గా బాలీవుడ్ లోకి రీమేక్ చేసి భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అంతే కాకుండా వెంటనే మళ్లీ జెర్సీ సినిమా బాలీవుడ్లో షాహిద్కపూర్ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.
కాగా తాజాగా మరొక టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన డైరెక్టర్ రాజు డీకే తో పని చేయడానికి రెడీ అయినట్లు సమాచారం. ఇప్పటికే సందీప్ రెడ్డి వంగా, గౌతమ్ తిన్ననూరి వంటి తెలుగు డైరెక్టర్ ల తో పని చేసిన షాహిద్ మళ్లీ టాలీవుడ్ డైరెక్టర్ ని లైన్ లో పెట్టడం బాలీవుడ్ ఇండస్ట్రీ లో సంచలనం అయింది. అంతేకాకుండా షాహిద్ కపూర్ దగ్గరికి బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన డైరెక్టర్లు కథ చెప్పాలని ప్రయత్నాలు చేస్తున్నారని వారిని పక్కన పెట్టేసి ఓన్లీ టాలీవుడ్ ఇండస్ట్రీ అన్న తరహాలో వ్యవహరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.