కరోనా తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతోంది. పాజిటివ్ కేసులతో పాటు మరణాలు కూడా ఎక్కువ నమోదు అవుతున్నాయి. సినీ రంగాన్ని కూడా కరోనా కుదిపేస్తోంది. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ ఈతరం ఫిలింస్ అధినేత పోకూరి రామారావు కరోనాతో నిన్న సాయంత్రం మృతి చెందారు. ఈతరం బ్యానర్ లో అనేక విజయవంతమైన సినిమాలు నిర్మించారు.
ఎనభై దశకంలో టి.కృష్ణ దర్శకత్వంలో ఎన్నో ఆదర్శవంతమైన సినిమాలు నిర్మించారు. ఈ జనరేషన్ లో గోపీచంద్ తో ఒంటరి, రణం వంటి సినిమాలు నిర్మించారు. ప్రముఖ నిర్మాత పోకూరి బాబూరావుకి ఈయన సోదరుడు. ఇటివల ఆయనకు కరోనా పాజిటివ్ రావడంతో కాంటినెంటల్ ఆసుపత్రిలో వైద్యం అందించారు. పరిస్థితి విషమించడంతో ఆయన మృతి చెందారు.