దశాబ్దాలుగా దేశంలో ఏడాదికి ఎక్కువ సినిమాలు నిర్మించేది టాలీవుడ్ మాత్రమే. ఈ విషయంలో BOLLYWOOD, KOLLYWOOD కూడా TOLLYWOOD ని ఎప్పుడూ రీచ్ కాలేదు. సినిమా మేకింగ్ మాత్రమే కాదు.. కలెక్షన్ల పరంగా కూడా తెలుగు సినిమా స్పాన్ ఎక్కువ. తమిళ సినిమాకు దక్షిణాది భాషలు, హిందీ డబ్బింగ్ ద్వారా వచ్చే కలెక్షన్లు.. ఒక తెలుగు BLOCKBUSTER సినిమా కేవలం TELUGU లాంగ్వేజ్ లోనే ఆ స్థాయి కలెక్షన్లు సాధిస్తుంది. నరసింహనాయుడు, ఖుషి, ఇంద్ర, పోకిరి, మగధీర, అత్తారింటికి దారేది, శ్రీమంతుడు, ఖైదీ నెంబర్ 150, సైరా.. వీటిని ప్రూవ్ చేశాయి కూడా. ఇంత స్పాన్ ఉన్న తెలుగు సినిమాలో ఈమధ్య స్టార్ హీరోల నుంచి సినిమాల వేగం తక్కువైంది. దీనికి కరోనా తోడైంది. కానీ.. ఇప్పుడు హీరోలు వేగం పెంచారు. వరుసగా సినిమాలు లైన్ లో పెడుతున్నారు.
మెగాస్టార్ చిరంజీవి నుంచి నేటి జనరేషన్ హీరోల వరకూ ఇదే పరిస్థితి. చిరంజీవి నాలుగు ప్రాజెక్టులు లైన్ లో పెట్టారు. ఆచార్య షూటింగ్ పూర్తయ్యే దశలో ఉంది. లూసిఫర్ రీమేక్ కూడా ప్రారంభమైంది. మెహర్ రమేశ్, బాబీతో సినిమాలు కూడా మొదలుపెట్టి ఈ ఏడాదే 3 సినిమాలు రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. బాలకృష్ణ-బోయపాటి సినిమా షూటింగ్ దశలో ఉంది. తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేయొచ్చని తెలుస్తోంది. నాగార్జున వైల్డ్ డాగ్ పూర్తైంది. దీని తర్వాత బ్రహ్మాస్త్ర, ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో సినిమా చేసే అవకాశం ఉంది. వెంకటేశ్ నారప్ప షూటింగ్ దాదాపు పూర్తైంది. దీని తర్వాత ఓ కొరియన్ సినిమా రీమేక్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. తరుణ్ భాస్కర్ తో సినిమా చేసే అవకాశమూ ఉన్నట్టు తెలుస్తోంది.
పవన్ కల్యాణ్ పాలిటిక్స్ తోపాటు సినిమాల్లో కూడా వేగం చూపిస్తూ నాలుగు సినిమాలు అనౌన్స్ చేశారు. వకీల్ సాబ్ పూర్తైంది. క్రిష్ తో సినిమా షూటింగ్ లో ఉంది. అయ్యప్పణుమ్ కోషియమ్ రీమేక్ మొదలైంది. హరీశ్ శంకర్ తో సినిమా ప్రారంభం కావాల్సి ఉంది. దీని తర్వాత సురేందర్ రెడ్డితో సినిమా కన్ఫర్మ్ అయింది. వీటి తర్వాత పూరి జగన్నాధ్ తో సినిమా ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. మహేశ్ సర్కారు వారి పాట సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమా తర్వాత దాదాపుగా రాజమౌళితో సినిమా ఉండే అవకాశం ఉంది. ప్రభాస్ ఏకంగా నాలుగు సినిమాలు లైన్ లో పెట్టాడు. రాధేశ్యామ్ షూటింగ్ దశలో ఉంది. ఆదిపురుష్ ప్రారంభం కాబోతోంది. ప్రశాంత్ నీల్ తో సలార్ ప్రారంభమైంది. వీటి తర్వాత నాగ్ అశ్విన్ తో సినిమా లైన్ లో ఉంది. రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్, ఆచార్య సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. వీటి తర్వాత జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సినిమా ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ షూటింగ్ దశలో ఉంది. దీని తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేయబోతున్నారు. బన్నీ పుష్ఫ షూటింగ్ దశలో ఉంది. తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో సినిమా, వేణు శ్రీరామ్ తో ఐకాన్ ఉండొచ్చని తెలుస్తోంది.
రానా విరాటపర్వం, అయ్యపణుమ్ కోషియం రీమేక్, నాగచైతన్య లవ్ స్టోరీ, విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థ్యాంక్యూ, రవితేజ ఖిలాడి తర్వాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఎవడో ఒకడు, సాయిధరమ్ తేజ్-దేవ్ కట్టా సినిమా, వరుణ్ తేజ్ గని, ఎఫ్3, నితిన్ రంగ్ దే, చెక్ సినిమాలు, విజయ్ దేవరకొండ లైగర్ తర్వాత సుకుమార్ తో సినిమా, గోపీచంద్ సీటీమార్ తర్వాత తేజ దర్శకత్వంలో సినిమా, శర్వానంద్ శ్రీకారం, మహా సముద్రం సినిమాలు, నాగశౌర్య లక్ష్య, శ్రీ విష్ణు గాలి సంపత్, అడవి శేష్ మేజర్, అఖిల్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా, మంచు విష్ణు మోసగాళ్లు, మంచు మనోజ్ అహం బ్రహ్మస్మి.. ఇలా యువ హీరోలు కూడా వరుసగా సినిమాలు లైనప్ లో పెట్టుకున్నారు. దీంతో టాలీవుడ్ చాలా సినిమాల లైనప్ తో బిజీగా ఉంది. కరోనాతే వేస్ట్ అయిన ఏడాది గ్యాప్ ను పూరించేందుకు హీరోలు భారీ లైనప్ ప్లాన్ చేసుకోవడం శుభపరిణామం.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!