Tollywood: టాలీవుడ్ ఇండస్ట్రీలో కథ పరంగా ఒక సరికొత్త ట్రెండ్ కొనసాగుతూ ఉంటుంది. ఒకప్పుడు ఫ్యాక్షన్ సినిమాల ట్రెండ్ కొనసాగాయి. బాలయ్య బాబు(Balakrishna) సమరసింహా రెడ్డి(Samarasimha reddy) సూపర్ డూపర్ హిట్ కావడంతో ఆ తర్వాత వరుసపెట్టి అప్పటి స్టార్ హీరోలు.. నాగార్జున ఎదురులేని మనిషి, వెంకటేష్ “జయం మనదేరా”, చిరంజీవి “ఇంద్ర” వంటి సినిమాలు చేయడం 90లో చూడటం జరిగింది. ఆ తర్వాత టాప్ హీరోలుగా వెలుగుతున్న ఇప్పటి స్టార్ హీరోలు పవన్(Pawan), మహేష్(Mahesh), ఎన్టీఆర్(NTR), వంటి వారు మొన్నటిదాకా పోలీస్ స్టోరీ లు నేపథ్యం ఉన్న సినిమాలు చేయడం జరిగింది. ఈ ట్రెండ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సృష్టించారు.
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్(Purijagannath) దర్శకత్వంలో “పోకిరి”(Pookiri) సినిమాతో ఇండస్ట్రీ రికార్డు సృష్టించిన మహేష్ ఆ తరువాత.. దూకుడు(Dookudu).. ఇంకా మరి కొన్ని సినిమాలలో పోలీస్ ఆఫీసర్ పాత్ర చేసి ప్రేక్షకులను అలరించాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ “గబ్బర్ సింగ్” లో పోలీస్ పాత్ర చేయడం జరిగింది. ఎన్టీఆర్ టెంపర్ సినిమా తో అలరించడం మనం చూశాం. రవితేజ విక్రమార్కుడు తో అలరించగా ఆ రీతిగా అప్పట్లో మొన్నటిదాకా స్టోరీ పరంగా పోలీస్ నేపథ్యం ఉన్న స్టోరీలు వచ్చాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఇండస్ట్రీ కథలు వింటుంటే చాలా వరకు అడవి బాట పట్టిన హీరోలు కనిపిస్తున్నారు.
“RRR”, “పుష్ప”, “ఆచార్య”, విరాటపర్వం ఈ నాలుగు టాప్ మోస్ట్ సినిమాలు కథలు చూస్తే అడవి మెయిన్ రోల్ పోషిస్తుంది. RRR లో… అడవిలో ఉండే కొన్ని గ్రామాలకు నాయకుడిగా ఎన్టీఆర్ కనిపిస్తుండగా.. “పుష్ప” సినిమాలో ఇప్పటికే అల్లు అర్జున్ పాత్ర స్మగ్లర్ గా మనం చూశాం. ఇదిలా ఉంటే విరాటపర్వంలో అదే రీతిలో “ఆచార్య”లో రానా అదేవిధంగా చిరంజీవి, రామ్ చరణ్ నక్సలైట్లు గా కనిపిస్తున్నారు. మొత్తంమీద చూసుకుంటే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టోరీ పరంగా ఫారెస్ట్ నేపథ్యం ఉన్న సినిమాలు సరికొత్త ట్రెండ్ సృష్టిస్తూ ఉన్నాయి.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!