Tollywood: టాలీవుడ్ విషయంలో AP ప్రభుత్వం మొండి వైఖరి గురించి ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన పనిలేదు. టాలీవుడ్ పెద్దలు పలుమార్లు ఈ విషయం చర్చలు జరిపినా ఉపయోగం లేకుండా పోయింది. ఇకపోతే గత వారం రిలీజైన పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ విషయంలో ఎంత రాజకీయం జరిగిందో అందరూ చూసారు. టాలీవుడ్ దిగ్గజాలు అయినటువంటి మెగాస్టార్, సూపర్ స్టార్, రెబల్ స్టార్ వెళ్లి అడిగినా AP ప్రభుత్వం తమ వైఖరిని మార్చుకోకపోవడం వారి అనైతికతను సూచిస్తుంది. ఇక భీమ్లానాయక్ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నా కూడా APలో టికెట్ల రేట్లు తక్కువగా ఉండటం వల్ల వసూళ్లు అంతంతమాత్రమే వున్నాయి.
Tollywood Dark Secrets: తెలుగు సినిమాలో ఆఫర్లు కావాలంటే ఆ పని చేయాల్సిందే: వర్ధమాన నటి
Tollywood: ఈవారం సినిమాల పరిస్థితి ఏమిటో?
ఇక ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న శర్వానంద్ ఆడవాళ్లు మీకు జోహార్లు మరియు సెబాస్టియన్ సినిమాల విషయంలో AP ప్రభుత్వం తన ఆంక్షలను ఏమేర సడలిస్తుందో ఇపుడు అంతు చిక్కని ప్రశ్నలా మారింది. ఇద్దరు కూడా మీడియం రేంజ్ హీరోలు, చిన్న సినిమాలు కావున బెనిఫిట్ షోల గొడవ ఉండకపోవచ్చు. కానీ టిక్కెట్ల రేట్ల పరిస్థితి గురించే ఇపుడు చర్చ. టికెట్ల రేట్లు అంత తక్కువ ఉంటే మాత్రం ఈ సినిమాలకు చాలా తీవ్రమైన నష్టాలను చవిచూడక తప్పదు. కనుక ఆ సినిమాలపై పాత జీవో ఎలా పని చేస్తుంది అనేది చూడాలి.
Tollywood: ఆ టాలీవుడ్ అందగాళ్ళు ఇప్పుడు కనిపించడంలేదు.. ఇప్పుడు వారు చేసే పనులు ఇవే!
జీవో మారిపోనుందా?
అవుననే అంటున్నారు ఓ వర్గంవారు. రాజకీయంగా జనసేనానిని టార్గెట్ చేయడం వలెనే AP ప్రభుత్వం భీమ్లా నాయక్ విషయంలో వెనక్కి తగ్గలేదని వీరు విశ్లేసిస్తున్నారు. ఇక ముందు రిలీజ్ కాబోతున్న సినిమాల విషయంలో ఆ ప్రాబ్లెమ్ లేదు కనుక కొత్త జీవో విడుదల చేసి టిక్కెట్ల రేట్లను పెంచుకోవలసిందిగా సూచించే అవకాలు లేకపోలేదని వారి భావన. ఇకపోతే ఆమధ్య రిలీజైన బంగార్రాజు మరియు అఖండ సినిమాలకు టికెట్ల రేట్లు తక్కువ ఉన్న జీవో అమలులో ఉన్నా కూడా అధికారులు పెద్దగా పట్టించుకోక పోవడంతో థియేటర్ ఓనర్స్ ఎక్కువ రేటు పెట్టి అమ్మారు. ఇప్పుడు రిలీజు కాబోతున్న సినిమాలకు కూడా ఇదే వర్తించక మానదు.