Star Heroines Remuneration : గత ఏడాది నుంచి ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభించడంతో ఈ వైరస్ ప్రభావం అన్ని రంగాలపై తీవ్రమైన ప్రభావం చూపింది.
ఈ క్రమంలోనే కరోనా ప్రభావం టాలీవుడ్ ఇండస్ట్రీ పై కోలుకోలేని దెబ్బకొట్టిందని చెప్పవచ్చు. లాక్ డౌన్ కారణంగా సినిమాలు ఆగిపోవడంతో ఎంతో మందికి పనులు లేకుండాపోయాయి. ఈ క్రమంలోనే నిర్మాతలు భారీ నష్టాలను చవి చూశారు.
తెలుగు ఇండస్ట్రీ కరోనా వల్ల దాదాపు రెండు వేల కోట్ల రూపాయలను నష్టపోయింది. ఇలాంటి పరిస్థితుల నుంచి ఇండస్ట్రీ కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీకి పూర్వ వైభవం తీసుకు రావడం కోసం ప్రతి ఒక్కరు తమ వంతు సాయం చేస్తున్నారు. ఇందులో భాగంగానే మన స్టార్ హీరోయిన్లు సైతం వారి రెమ్యూనరేషన్ ను భారీగా తగ్గించేశారు.
రెమ్యూనరేషన్ తగ్గించుకున్న హీరోయిన్లు:
*పూజా హెగ్డే: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న పూజాహెగ్డే ఒక్కో సినిమాకు దాదాపు రెండు కోట్ల వరకు డిమాండ్ చేసేది. ప్రస్తుతం కరోనా పరిస్థితుల వల్ల ఈమె చేయబోయే సినిమాల విషయంలో రెమ్యునరేషన్ తగ్గించుకున్న ఉన్నట్లు సమాచారం.
*సమంత: సమంత ప్రస్తుతం ఒక్కో సినిమాకు రెండు కోట్ల రూపాయల వరకు పారితోషికం తీసుకుంటున్నారు. అయితే సమంత నటించే సినిమాలలో రెమ్యునరేషన్ తగ్గించుకున్నట్లు తెలుస్తోంది.
* నయనతార: స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న నయనతార ఒకప్పుడు ఒక్కో సినిమాకు మూడు కోట్ల వరకు డిమాండ్ చేసేది. అయితే కరోనా ప్రభావంతో ఈమె పారితోషికం చాలా వరకు తగ్గిపోయిందని తెలుస్తోంది.
* అనుష్క శెట్టి: అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందం అభినయంతో ఎంతోమందిని ఆకట్టుకున్న అనుష్క ఒక్కో సినిమాకు మూడు కోట్ల రూపాయలు తీసుకునేది. అయితే కరోనా ప్రభావం వల్ల ఈమె ఒక్కో సినిమాకు కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటుంది.
* రకుల్ ప్రీత్ సింగ్: అందరికన్నా ముందుగా పారితోషికాన్ని తగ్గించుకున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఈమె సొంతంగా తన పారితోషికాన్ని కోట్లలో నుంచి లక్షల్లోకి తగ్గించుకుంది.
* కాజల్ అగర్వాల్: రెమ్యూనరేషన్ విషయంలో ఎంతో మొండిగా వ్యవహరించి తగ్గేదే లేదన్న కాజల్ అగర్వాల్ ను కరోనా దించిందని చెప్పవచ్చు. ఒకప్పుడు కోటిన్నర డిమాండ్ చేసే కాజల్ అగర్వాల్ ప్రస్తుతం కోటి రూపాయలకే సినిమాలు చేస్తుంది.
*రష్మిక: సరిలేరు నీకెవ్వరు సినిమాతో కోటి రూపాయలు తీసుకున్న రష్మిక కరోనా ప్రభావంతో పారితోషికాన్ని భారీగా తగ్గించిందని తెలుస్తోంది.
*శృతిహాసన్: ఒకప్పుడు కోటి రూపాయల పైగా డిమాండ్ చేసే శృతి హాసన్ ప్రస్తుతం లక్షలలో రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. ప్రభాస్ సలార్ సినిమా కోసం కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటుంది. వీరే కాకుండా మరికొంతమంది హీరోయిన్లు కూడా వారి పారితోషికం భారీగా తగ్గించుకొన్నట్లు తెలుస్తోంది.