“ప్రేమం” సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించింది సాయి పల్లవి. ఆ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో “ఫిదా” సినిమాతో గ్లామర్ లేకపోయినా కానీ తన పెర్ఫార్మెన్స్ తో తెలుగులో ఫస్ట్ సినిమాతోనే భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. అంతే కాకుండా తన నటనతో కుర్రకారును ఎంతగానో ఆకట్టుకుంది. చాలా వరకు ఇండస్ట్రీలో పెర్ఫార్మెన్స్ రోల్స్ అవకాశాలను అందిపుచ్చుకొని సాయి పల్లవి కెరియర్ మొదటిలో ఫిదా, ఎంసీఏ వంటి సినిమాల్లో నటించి విజయాలు సాధించి తర్వాత చేసిన సినిమాలతో పరాజయాన్ని చూసింది సాయి పల్లవి.
ప్రస్తుతం “విరాటపర్వం” అనే సినిమాలో రానాతో నటిస్తూనే మరో పక్క శేఖర్ కమ్ముల దర్శకత్వంలో “లవ్ స్టోరీ” సినిమాలో నాగచైతన్య పక్కన హీరోయిన్ గా చేస్తోంది. సక్సెస్ కి దూరంగా ఉన్న సాయి పల్లవికి అదిరిపోయే ఆఫర్ వచ్చిందట. పైగా వెతుక్కుంటూ ఆమెకె వరించిందట. నాని నటించబోయే “శ్యామ్ సింగరాయి” సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించడానికి రెడీ అయినట్లు టాక్ వస్తోంది.
MCA సినిమాతో ఈ జంట ప్రేక్షకులను బాగా అలరించారు. దాంతో మరోసారి ఈ జంట మరోసారి నటించడానికి రెడీ అయినట్లు సమాచారం. అయితే ఈ సినిమా కోసం ఏకంగా సాయి పల్లవి రెండు కోట్లు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు టాక్ వస్తోంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా బడ్జెట్ తగ్గించుకునే పరిస్థితి ఉండగా నిర్మాతకి షాక్ ఇస్తూ సాయి పల్లవి ఈ విధంగా రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో ఈ వార్త ఇండస్ట్రీలో సంచలనంగా మారింది అని ఇండస్ట్రీ వర్గాలలో వినబడుతున్న టాక్.