కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న “ఆచార్య” షూటింగ్ త్వరలో స్టార్ట్ కానుందట. మొన్నటి వరకు కరోనా వైరస్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండటంతో పాటు ప్రభుత్వ అనుమతులు లేకుండా ఉండటంతో సినిమా షూటింగ్ వాయిదా పడింది. అయితే ఇటీవల కాలంలో ప్రభుత్వాల నుంచి అనుమతులు రావడంతో త్వరలో సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. అయితే సినిమాలో రామ్ చరణ్ క్యారెక్టర్ కి సంబంధించి 40 నిమిషాల పాత్ర ఉండటంతో… ముందుగా చెర్రీ పార్ట్ పూర్తి చేయాలని సినిమా యూనిట్ డిసైడ్ అయిందట.
అయితే ఈ సినిమాలో చరణ్ కి హీరోయిన్ గా మొదట సమంతాని తీసుకోవాలని కొరటాల భావించారట. కానీ బడ్జెట్ అనుకూలించకపోవడంతో…. ఇప్పుడు సమంత ప్లేస్ లో రష్మిక మందనని సినిమా యూనిట్ తీసుకోవడానికి డిసైడ్ అయినట్లు టాక్ వస్తోంది. రష్మిక మందన ఆల్రెడీ ఒక పక్క సుకుమార్ దర్శకత్వంలో “పుష్ప” లో మెగా హీరో బన్నీ పక్కన నటిస్తోంది. అయితే తాజాగా చరణ్ పక్కన కూడా ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్న తరుణంలో మెగా ఫాన్స్ రష్మిక మందన ని మెగా హీరోయిన్ అని అంటున్నారు.
దీంతో ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ ప్లేస్ రష్మిక మందన కి వచ్చేసినట్లే అనే టాక్ వినబడుతుంది. పూజా హెగ్డే ముందున్నా గాని మెగా కాంపౌండ్ లోకి రష్మిక మందన ఎంట్రీ ఇవ్వటంతో… ఇండస్ట్రీలో తిరుగులేని హీరోయిన్ అయిపోయినట్లే అని సినిమా విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!