టాలీవుడ అగ్ర కథానాయకుడు చిరంజీవి 152వ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. త్వరలోనే సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో చిరంజీవి సరసన నటించబోయే నాయకి ఎవరు అనే దానిపై చాలా వార్తలే వినపడ్డాయి. ముఖ్యంగా నయనతార, అనుష్క పేర్లు వినపడ్డప్పటికీ చెన్నై సొగసరి త్రిష పేరు ప్రముఖంగా వినపడింది. కానీ చిత్ర యూనిట్ ఎలాంటి ప్రకటనా చేయలేదు. అయితే తాజాగా ఈ విషయాన్ని త్రిష తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఖరారు చేశారు. ట్విట్టర్లో ఓ విశ్లేషకుడు ఈ ఏడాది త్రిష మూడు సినిమాల్లో నటిస్తున్నారు. అందులో చిరంజీవి, కొరటాల శివ సినిమా కూడా ఉందని ఆయన పేర్కొన్నారు. దానికి బదులుగా త్రిష విక్టరీ సింబల్తో పాటు హ్యాష్ ట్యాగ్ 2020ను పోస్ట్ చేశారు. అంటే త్రిష తాను చిరంజీవి చిత్రంలో నటించబోతున్న విషయాన్ని ఖరారు చేసేసింది. రామ్చరణ్, నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు.
previous post