సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ త్రిష ఇటీవల తమిళ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు రావడం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కానున్నట్లు న్యూస్ వైరల్ కావడం జరిగింది. ఈ వార్తలపై త్రిష తల్లి ఉమా కృష్ణన్ స్పందించడం జరిగింది. త్రిష రాజకీయాల్లోకి రావడం లేదు. ప్రస్తుతం ఫోకస్ అంతా సినిమాల పైన పెట్టడం జరిగింది. పలు భాషల్లో సినిమాలు చేయడానికి త్రిష రెడీ అవుతుంది అని క్లారిటీ ఇవ్వటం జరిగింది. మరోపక్క త్రిష కూడా తనకి రాజకీయాల్లోకి వెళ్ళటం ఇష్టం లేదని చెప్పినట్లు సమాచారం. త్రిష రాజకీయాల్లోకి వస్తున్నట్లు వార్తలు ఎవరు పుట్టించారో అసలు అర్థం కావటం లేదు.
ఇటువంటి వార్తలను అసలు నమ్మవద్దు అంటూ… త్రిష తల్లి అసహనం వ్యక్తం చేయడం జరిగింది. తమిళ సినిమా రంగంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన “పొన్నియన్ సెల్వన్” అనే సినిమాలో నటించడం జరిగింది. సెన్సేషనల్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 30 వ తారీకు విడుదల కానుంది. తమిళంలో మాత్రమే కాదు తెలుగులో ఇంకా పలు భాషల్లో భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. ఒకప్పుడు తెలుగులో వరుస అవకాశాలు అందుకున్న త్రిష.. వరుస ప్లాపులు పలకరించాక తమిళ ఇండస్ట్రీకి పరిమితం అయింది.
తెలుగులో దాదాపు టాప్ హీరోలందరి సరసన నటించింది. మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్, పవన్ కళ్యాణ్, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ ఇంకా చాలామంది హీరోలతో.. అనేక సినిమాలు తెలుగులో చేసిన త్రిష ప్రస్తుతం ఎక్కువగా తమిళ్ సినిమాలలోనే కనిపిస్తుంది. తమిళ రాజకీయాల్లో చాలామంది నటీనటులు వెళ్లడంతో త్రిష కూడా వెళ్తున్నట్లు ఆమెకు విజయ్ సలహా ఇచ్చినట్లు అందుకే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నట్లు వార్త రావడం జరిగింది. ఈ క్రమంలో ఆమె తల్లి త్రిష రాజకీయాల్లోకి వెళ్తున్నట్లు వస్తున్నావార్తలలో వాస్తవం లేదని తెలపడంతో క్లారిటీ రావడం జరిగింది.