మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా గతంలో అతడు, ఖలేజా రెండు సినిమాలు రావటం తెలిసిందే. రెండు సినిమాలలో కూడా మహేష్ బాబు చాలా డిఫరెంట్ గా కనిపించడం జరిగింది. అతడు చాలా సైలెంట్ గా కనిపిస్తే కలేజాలో చాలా కామెడీ చేస్తూ తన పంచ్ పవర్ ఏంటో మహేష్ నిరూపించడం జరిగింది. నటన పరంగా కామెడీ యాంగిల్ మహేష్ బాబు లో ఎక్కువగా కలేజాలో త్రివిక్రమ్ బయటికి తీశాడు. అయితే మళ్లీ దాదాపు 11 సంవత్సరాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో ప్రస్తుతం మూడో సినిమా తెరకెక్కుతోంది.
అయితే ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ జూన్ నెలలో ప్రారంభం కావాల్సి ఉండగా కొన్ని అన్నివారాల కారణాలవల్ల వాయిదా పడుతూ వచ్చింది. దీంతో “సర్కారు వారి పాట” విజయనీ కుటుంబ సభ్యులతో కలిసి యూరప్ ట్రిప్ వేసి మహేష్ ఆస్వాదించడం జరిగింది. అయితే మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమాకి సంబంధించిన కలర్ షూటింగ్ విషయంలో రకరకాల వార్తలు వస్తూ ఉండటంతో తాజాగా సినిమా యూనిట్ నుండి సమాచారం.. ప్రకారం ఆగస్టు మొదటివారం నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది.
ఏకధాటిగా షూటింగ్ జరుపుకునీ అతి తక్కువ టైంలోనే సినిమా విడుదల చేయాలని వచ్చే సంక్రాంతి పండుగకు రిలీజ్ చేయాలని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2020 లో “అలా వైకుంఠపురంలో” సినిమా తీసిన తర్వాత ఇప్పటివరకు దర్శకుడిగా త్రివిక్రమ్ చేయలేదు. ఇటువంటి దారుణంలో మహేష్ బాబుతో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తూ ఉండటంతో ఈ వార్త ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. సినిమాలో మహేష్ బాబు సరసన హీరోయిన్ పాత్రలో పూజ హెగ్డే నటిస్తోంది.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!