Trivikram Mahesh: టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ కాంబినేషన్ లలో మొదటి వరుసలో ఉండేది త్రివిక్రమ్ మహేష్ కాంబినేషన్. ఇద్దరికీ మంచి టైమింగ్ సెన్సాఫ్ హ్యూమర్ కలిగిన కామెడీ ఉన్న క్రమంలో వీరిద్దరి కలయికలో గతంలో వచ్చిన “అతడు”, “ఖలేజా” సినిమాలు సినిమా ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి.
ముఖ్యంగా “అతడు” సినిమాలో మహేష్ లో ఉన్న ప్రొఫెషనల్ యాక్టర్ ని చాలా అద్భుతంగా బయటకు తీసాడు త్రివిక్రమ్ ఆ తరువాత మహేష్ బాబు లో ఉన్న కామెడీ యాంగిల్ ఖలేజా సినిమా తో సరి కొత్తగా చూపించి అభిమానులను ఎంతగానో అలరించాడు.
ఖలేజా సినిమా రాకముందు వరకు మహేష్ బాబు అంతగా పెద్దగా కామెడీ చేసిన సందర్భాలు లేవు. “ఖలేజా” తర్వాత మహేష్ కూడా ఎక్కువగా కామెడీ కంటెంట్ కలిగిన సబ్జెక్ట్ ఉన్న దూకుడు.. ఇంకా చాలా సినిమాలు చేసి.. ఎంటర్టైన్మెంట్ చేయటంలో కూడా కింగ్ అనిపించుకున్నాడు.
అయితే దాదాపు వీరిద్దరి కాంబినేషన్ లో 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మరో సినిమా రాబోతోంది. ఈ విషయాన్ని గత ఏడాది సమ్మర్ లోనే ప్రకటించడం జరిగింది.
అయితే తాజాగా నేడు సినిమాకి సంబంధించి పూజా కార్యక్రమాలు అధికారికంగా జరిగాయి. వాటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. డైరెక్టర్ త్రివిక్రమ్.. హీరోయిన్ పూజా హెగ్డే తో పాటు నిర్మాతలు మరియు మహేష్.. భార్య నమ్రత ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మహేష్ ఈ పూజా కార్యక్రమానికి హాజరు కాలేదు.
ప్రస్తుతం మహేష్ బాబు గీత గోవిందం డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో “సర్కారు వారి పాట” సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మే 12వ తారీకు వేసవి సందర్భంగా రిలీజ్ కానుంది.
దాదాపు సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఇదే సమయంలో త్రివిక్రమ్ సినిమా మరి కొద్ది రోజుల స్టార్ట్ చేసి వరుసపెట్టి షెడ్యూల్ తో చాలా త్వరగా కంప్లీట్ చేసే ఆలోచనలో మహేష్ ఉన్నారు. ఏదైనా వెంటనే రాజమౌళి సినిమా స్టార్ట్ కానున్నట్లు ఫిలింనగర్ టాక్.