మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి స్నేహితులు అని అందరికీ తెలుసు. పాలు నీళ్ళు లాగా ఉండే వీరి స్నేహం కి అభిమానులు కూడా ఎంతో గౌరవం ఇస్తారు. పవన్ కళ్యాణ్ అభిమానులు త్రివిక్రమ్ ని గురూజీ అంటూ ముద్దుగా పిలుచుకుంటారు. పవన్ కళ్యాణ్ కి జల్సా, అత్తారింటికి దారేది వంటి రెండు బ్లాక్ బస్టర్ హిట్ లు ఇచ్చిన త్రివిక్రమ్ “అజ్ఞాతవాసి” సినిమా తో అట్టర్ ఫ్లాప్ ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ కెరీర్ లో 25 వ సినిమాగా తెరకెక్కిన “అజ్ఞాతవాసి” 2018వ సంవత్సరంలో రిలీజ్ అయ్యి దారుణంగా అట్టర్ ఫ్లాప్ అయ్యింది.
పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ సినిమాపై అంచనాలు చాలా పెట్టుకోవటంతో అసలు సినిమాలో విషయం లేకపోవడంతో పాటు త్రివిక్రమ్ మార్క్ డైరెక్షన్ కూడా కనిపించకపోవడంతో… సినిమా ప్లాప్ అవడంతో త్రివిక్రమ్ పై అప్పటినుండి పవన్ ఫ్యాన్స్ చాలా కోపంగా ఉన్నారు. అటువంటిది ఇటీవల పవన్ కల్యాణ్ మళ్లీ సినిమా రంగంలో రీ ఎంట్రీ ఇవ్వడం తో చాలా గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి మంచి చేసే రీతిలో త్రివిక్రమ్ సరైన స్క్రిప్ట్ పవన్ కోసం సెలెక్ట్ చేసినట్లు ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి. పూర్తి మేటర్ లోకి వెళ్తే మలయాళం సూపర్ హిట్ మూవీ “అయ్యప్పనుమ్ కోషియుమ్” సినిమాని పవన్ తో రీమేక్ చేయడానికి త్రివిక్రమ్ రెడీ అయినట్లు సమాచారం.
ఇప్పటికే ఈ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ హక్కులను త్రివిక్రమ్ సన్నిహితుడు నిర్మాత హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ అధినేత రాధాకృష్ణ దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మలయాళంలో మల్టీస్టారర్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాని తెలుగులో పవన్ కళ్యాణ్ తో పాటు మరో ప్రముఖ హీరో నీ లైన్ లో త్రివిక్రమ్ పెడుతున్నట్లు సమాచారం. “వకీల్ సాబ్” సినిమా తర్వాత ఈ సినిమాని త్వరగా తెరకెక్కించాలని పవన్ డిసైడ్ అయినట్లు టాక్. దీంతో వచ్చే నెల 2వ తారీఖు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన వస్తుందని ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.