Mahesh: టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు – డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అనగానే ఎలాంటి ఊహాగానాలు వుంటాయో వేరే చెప్పనవసరం లేదు. అయితే వీరి కాంబినేషన్లో వచ్చిన గత చిత్రం ‘ఖలేజా’ బుల్లితెరపై మంచి మార్కులు కొట్టినా, థియేటర్లో బాగా ఆడలేదు. ఇపుడు తాజాగా వీరి కాంబినేషన్లో సుమారు 12 సంవత్సరాల తరువాత మరో సినిమా రాబోతుంది. కాగా ఇది మహేశ్ కెరీర్ లో 28వ చిత్రం. ఇప్పటికే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించబడిన ఈ చిత్రాన్ని.. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ రూమర్ ఫిలిం నగర్లో చక్కెర్లు కొడుతోంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇది మల్టీ స్టారర్ సినిమానా?
ఈ కాంబోలో ఓ కీలక పాత్రలో మరో హీరో నటించనున్నారని గత 2 రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కాగా అది గెస్ట్ రోల్ కు మించి వుంటుందని భోగట్టా దీని కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పటికే కొంతమంది హీరోలని సంప్రదిస్తున్నారని టాక్ నడుస్తోంది. ఈ స్పెషల్ క్యారక్టర్ కోసం టాలీవుడ్ యంగ్ హీరోలైన శర్వానంద్ లేదా నితిన్, వారిద్దరూ కాదంటే నాని.. ఇలా వారిలో ఎవరైనా ఒకరిని సెట్ చేయాలని త్రివిక్రమ్ భావిస్తున్నారట. ఇది ‘అల వైకుంఠపురములో’ చిత్రంలో అక్కినేని హీరో సుశాంత్ ప్లే చేసిన పాత్ర తరహాలో ఉంటుందని టాక్. అయితే ఇది చాలా వరకు నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అని అంటున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
విలన్ పాత్రకోసం వెతుకుతున్నారా?
ఇంచుమించు అలంటి రూమర్స్ వినబడుతున్నాయి. అయితే మొదట నెగిటివ్ షేడ్స్ వున్న పాత్ర కాస్త సినిమా ఆఖరికి పాజిటివ్ గా మారుతుందని అంటున్నారు. ఐతే అసలు ఇందులో నిజమెంతనేది తెలియాలంటే ఇంకొన్నాళ్ళు వేచి చూడాల్సిందే. ఇకపోతే ‘సర్కారు వారి పాట’ సక్సెస్ జోష్ లో ఉన్న మహేష్.. ఈ మూవీ కోసం ఆసక్తిగా ఉన్నారని తెలుస్తోంది. ఇందులో ‘మహర్షి’ హీరోయిన్ పూజా హెగ్డే మరోసారి సూపర్ స్టార్ తో జోడీ కట్టనుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్నారు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!