Mahesh Trivikram: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు మూడో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి పూజా కార్యక్రమలు స్టార్ట్ కాగా.. రెగ్యులర్ షూటింగ్ జూన్ నెలాఖరు నుండి స్టార్ట్ కానుంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అతడు, ఖలేజా… రెండు సినిమాలు అభిమానులను ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. రెండు సినిమాలో కూడా మహేష్ నీ చాలా డిఫరెంట్ జోనర్ లలో త్రివిక్రమ్ చూపించడం జరిగింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
దీంతో ఇప్పుడు రాబోతున్న మూడో సినిమా లో మహేష్ బాబుని ఏ రకంగా త్రివిక్రమ్ చూపిస్తావా లేదా అన్నది సస్పెన్స్ గా నెలకొంది. ఇదిలా ఉంటే త్రివిక్రమ్ గత కొన్ని సినిమాల నుండి తన సినిమాలలో సీనియర్ హీరోయిన్ లతో పాటు…కుర్ర హీరోయిన్ లు ఉండేలా పాత్రలు క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అలా వైకుంఠపురం లో బన్నీ హీరో అయితే కీలక పాత్రలో అక్కినేని సుశాంత్ నటించడం జరిగింది. “అరవింద సమేత వీర రాఘవ” లో ఎన్టీఆర్ హీరోగా కీలక పాత్రలో “అందాల రాక్షసి” సినిమా హీరో నటించాడు.
అంతకుముందు త్రివిక్రమ్ సినిమాలో కూడా ఈ రీతిగానే పాత్రలో మరికొంత మంది హీరోలు నటించడం జరిగింది. ఇప్పుడు మహేష్ బాబు తో చేయబోయే సినిమాలో విలన్ పాత్రలో నందమూరి హీరోని త్రివిక్రమ్ సెట్ చేసినట్లు ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్ నడుస్తోంది. ప్రారంభంలో ఈ సినిమాలో నాచురల్ స్టార్ నాని పేరు వినిపించిన ఇప్పుడు నందమూరి తారకరత్న పేరు వినబడుతుంది. సినిమా సెకండాఫ్ లో… విలన్ పాత్రలో నందమూరి తారక రత్న కనిపించనున్నట్లు లేటెస్ట్ డాగ్ ఇండస్ట్రీలో వినపడుతోంది. ప్రస్తుతం మహేష్ ఫ్యామిలీతో విదేశీ పర్యటనలో ఉన్నారు. జూన్ నెలాఖరు కల్లా ఇండియా లో ల్యాండ్ అయ్యి త్రివిక్రమ్ సినిమా రెగ్యులర్ షూటింగ్ లో జాయిన్ కానున్నట్లు సమాచారం.