SSMB 28: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు గత నెలలో హైదరాబాద్ లో జరిగాయి. రెగ్యులర్ షూటింగ్ ఈ నెల చివర్లో లేకపోతే జూలై మాసంలో ప్రారంభించే ఆలోచనలో సినిమా యూనిట్ ఉంది. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇదిలా ఉంటే సినిమా టైటిల్ కు సంబంధించి త్రివిక్రమ్ గత కొంత కాలం నుండి.. “అ” అక్షరం సెంటిమెంట్ ఫాలో అవుతూ వస్తున్నారు. ఇక ఇదే సమయంలో సినిమాలో మెయిన్ హీరోయిన్ తో పాటు సైడ్ క్యారెక్టర్ గా మరొక హీరోయిన్ నీ కూడా తీసుకుంటూ వస్తున్నాడు. అత్తారింటికి దారేది, అరవింద సమేత వీర రాఘవ, అలా వైకుంఠపురం లో, అజ్ఞాతవాసి త్రివిక్రమ్ తీసిన ఈ సినిమాలలో మెయిన్ హీరోయిన్ తో పాటు మరొక హీరోయిన్ కి స్థానం ఉండేది.
ఇప్పుడు ఇదే సెంటిమెంట్ మహేష్ బాబు సినిమాకి ఉపయోగిస్తున్నాట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఇందుకోసం స్టార్టింగ్ లో “బీమ్లా నాయక్” ఫేమ్ సంయుక్త మీనన్ నీ తీసుకోవాలని భావించిన త్రివిక్రమ్.. తాజాగా “గ్యాంగ్ లీడర్” ఫెమ్ ప్రియాంక అరుల్ మోహన్ నీ తీసుకోవడానికి రెడీ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతమాత్రమే కాదు ఒక సీనియర్ హీరోయిన్ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో త్రివిక్రమ్ అతడు, ఖలేజా రెండు సినిమాలలో మహేష్ బాబునీ చాలా డిఫరెంట్ గా చూపించడం జరిగింది. దీంతో కాబోతున్న ఈ మూడో సినిమాల్లో…మహేష్ నీ ఏ విధంగా చూపిస్తాడు అన్నది సస్పెన్స్ గా నెలకొంది. ఈ సినిమాపై అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం మహేష్ కుటుంబంతో విదేశాలలో సేద తీరుతున్నారు. హైదరాబాద్ వచ్చిన వెంటనే త్రివిక్రమ్ సినిమా రెగ్యులర్ షూటింగ్ లో జాయిన్ కానున్నారు.