“RRR” సినిమా తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కెరీర్లో ఈ సినిమా 30 సినిమా కావడంతో త్రివిక్రమ్ నుండి కొత్తదనాన్ని నందమూరి అభిమానులు ఆశిస్తున్నారు. ముఖ్యంగా రాజమౌళితో చేసిన తర్వాత ఎన్టీఆర్ సినిమా చేస్తున్న తరుణంలో కచ్చితంగా హిట్ అవ్వాలని పైగా 30వ సినిమా కాబట్టి స్పెషల్ గా ఉండాలని కోరుతున్నారు. గతంలో సింహాద్రి, యమదొంగ వంటి సినిమాలో రాజమౌళి దర్శకత్వంలో చేసిన తర్వాత వరుస ప్లాపులు ఎన్టీఆర్ చూడటం జరిగింది. అయితే మళ్లీ ఈ పరిస్థితి రాకూడదని త్రివిక్రమ్ ని నందమూరి ఫ్యాన్స్ కోరుతున్నారు.
కానీ త్రివిక్రమ్ గత సినిమాల విషయంలో ఎలాంటి ఫార్ములా ఉపయోగించారో అదే ఫార్ములా ఎన్టీఆర్ సినిమాకి ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్. పూర్తి విషయంలోకి వెళ్తే అత్తారింటికి దారేది నుండి అలా వైకుంఠపురం సినిమా వరకూ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమాలో హీరో హీరోయిన్ల రోల్స్ కంటే సపోర్టింగ్ రోల్స్ కే ఎక్కువ బలం. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా మొత్తాన్ని వాళ్లే నడిపిస్తారు. అత్తారింటికి దారేది లో నభియా, అజ్ఞాతివాసీ లో కుష్బూ, అలా వైకుంఠపురం లో సినిమాలో టబు వంటి సపోర్టింగ్ క్యారెక్టర్ లతో సినిమాలు చేసుకుంటూ వచ్చారు.
పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద హీరో మొదలుకొని నితిన్ లాంటి హీరో వరకు ఎవరితో సినిమా చేసిన ఇదే ఫార్ములా త్రివిక్రమ్ ఉపయోగించారు. ఇప్పుడు ఇదే మాదిరిగా ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా కోసం సపోర్టింగ్ రోల్ లో రమ్యకృష్ణ ని పెట్టి సినిమా చేయడానికి త్రివిక్రమ్ రెడీ అయినట్లు ఇండస్ట్రీలో టాక్ వస్తోంది. రమ్యకృష్ణ ని డైరెక్ట్ చేయడం త్రివిక్రమ్ కి ఇదే ఫస్ట్ టైం ఐనా….ఎన్టీఆర్ రమ్యకృష్ణ కాంబినేషన్లో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి. నా అల్లుడు, సింహాద్రి లో రమ్యకృష్ణ ఐటమ్ సాంగ్ చేయడం జరిగింది. దీంతో మళ్లీ వీరి కాంబినేషన్ రిపీట్ అవుతుండడంతో నందమూరి అభిమానులలో సినిమాపై ఆసక్తి నెలకొంది.