Trivikram : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గత ఏడాది “అలా వైకుంఠపురం లో” సినిమా తో సూపర్ డూపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఆ సినిమా వచ్చి దాదాపు ఏడాది అయింది. గత ఏడాది సరిగ్గా సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ అయ్యి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అనేక రికార్డులు సృష్టించింది “అలా వైకుంఠపురం లో” సినిమా తర్వాత త్రివిక్రమ్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నట్లు ప్రకటన చేయటం తెలిసిందే.
అయితే ప్రకటన తర్వాత సినిమా ఎప్పుడు మొదలవుతుందో అని ఎన్టీఆర్ అభిమానులు ఎదురు చూస్తూ ఉన్న సమయంలో కరోనావైరస్ రావటం కేంద్రం లాక్డౌన్ విధించడంతో షూటింగ్ లు ఆగిపోవడంతో.. పరిస్థితులు మొత్తం తారుమారయ్యాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ “ఆర్ఆర్ఆర్” షూటింగ్ చేస్తూ ఉన్నారు. దీంతో ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ చేయబోయే సినిమా ఎప్పుడు మొదలవుతుంది అన్నది ఎవరికీ అర్థం కాని ప్రశ్నగా మిగిలిపోయింది. పరిస్థితి ఇలా ఉండగా ఇండస్ట్రీ నుండి సరికొత్త వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది.
అదేమిటంటే ఏప్రిల్ నెలాఖరు కల్లా ఎన్టీఆర్ తో ఎట్టి పరిస్థితుల్లో సినిమా స్టార్ట్ చేయాలని త్రివిక్రమ్ డిసైడ్ అయ్యారట. దీంతో ప్రస్తుతం రానా మరియు పవన్ కళ్యాణ్ చేస్తున్న మల్టీ స్టారర్ సినిమా కి రచన మరియు స్క్రీన్ ప్లే, డైలాగులు కంప్లీట్ చేయడం జరిగినట్లు, ఆ సినిమా షూటింగ్ కూడా చాలా ఫాస్ట్ గా దగ్గరుండి త్రివిక్రమ్ కంప్లీట్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. ఈ పరిణామంతో ఎట్టి పరిస్థితుల్లో వచ్చే నెలాఖరు కల్లా ఎన్టీఆర్ సినిమా స్టార్ట్ చేసి..తక్కువ టైంలోనే కంప్లీట్ చేయాలని మాటల మాంత్రికుడు అనుకుంటున్నారట. ఎన్టీఆర్ కెరీర్లో ఈ సినిమా 30 ది కావటంతో… ప్రతి సన్నివేశం హైలెట్ గా ఉండే విధంగా త్రివిక్రమ్ స్క్రిప్ట్ వర్క్ పై బాగా శ్రద్ధ పెట్టి కంప్లీట్ చేసినట్లు సమాచారం.