సాయి ధరమ్ తేజ్, రాశీఖన్నా జంటగా నటించిన ‘ప్రతిరోజూ పండగే’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. వచ్చే శుక్రవారం థియేటర్లలో సందడి చేయనుంది. తాత – మనవడి మధ్య నెలకొన్న అనుబంధమే కథాంశంగా.. దర్శకుడు మారుతి ఈ సినిమా రూపొందించారు. తాతగా సత్యరాజ్.. మనవడిగా సాయి ధరమ్ నటించారు. కామెడీ, ఫ్యామిలీ డ్రామా ఎంటర్టైనర్గా ఈ సినిమా రాబోతోంది.
అయితే ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి ప్రచారంలోకి వచ్చింది. క్లైమాక్స్లో ఊహించని ట్విస్ట్ ఉంటుందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా క్లైమాక్స్ ఉంటుందని సమాచారం. ఆ ట్విస్ట్ ఏంటో తెలియాలంటే వచ్చే శుక్రవారం వరకు ఆగాల్సిందే.