నాని ఇప్పుడు `జెర్సీ` సినిమాను ఏప్రిల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాడు. చిన్న వయసులో క్రికెటర్ కావాలనుకుని కాలేకపోయి 36 ఏళ్లకు భారత క్రికెట్ టీంకు ప్రాతినిధ్యం వహించే వ్యక్తి కథే ఇది. క్రికెట్ బంతి తలకు తగిలి చనిపోయిన సీనియర్ క్రికెటర్ రామన్ లాంబా జీవిత కథను బేస్ చేసుకుని దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాను తెరకెక్కించాడు. అయితే ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి శాడ్ ఎండింగ్ ఇచ్చాడట. అయితే తెలుగు ప్రేక్షకులు శాడ్ ఎండింగ్ను ఇష్టపడరు కాబట్టి నిర్మాతల సలహా మేర మరో క్లైమాక్స్ను కూడా రెడీ చేశాడట. మరి ఏ క్లైమాక్స్ను తీసుకోవాలనేది నిర్మాతలకే వదిలేశాడట. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్గా నటిస్తుంది.
previous post
next post