తమిళనాడు సూపర్స్టార్ రజనీకాంత్ 2021 నాటికి రాజకీయాలతో బిజీ కానున్నారు. ఈలోపు ఆయన తన సినిమా కమిట్మెంట్స్ను పూర్తి చేసేస్తున్నారు. అందులో భాగంగా తన 166వ సినిమాకు సంబంధించిన రంగం సిద్ధమవుతుంది. ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించబోయే ఈ సినిమా మార్చి నుండి సెట్స్కు వెళ్లనుంది. ఈ చిత్రంలో రజనీకాంత్ డబుల్రోల్ చేస్తున్నారని, ఒకరు పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా, మరొకరు సామాజికవేత్తగా కనపడబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. కాగా.. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ నటిస్తున్నారు. అందులో నయనతార పేరు ప్రముఖంగా వినిపించింది. ఇప్పుడు మరో హీరోయిన్గా కీర్తి సురేష్ నటిస్తుందని కోలీవుడ్ వర్గాల సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక సమాచారం వెలువడనుందట. చాలా కాలంగా మంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్న రజనీకాంత్కు పేట రూపంలో పెద్ద విజయం దక్కింది. దీంతో మురుగదాస్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
previous post
next post