Chiranjeevi: టాలీవుడ్ ఇండస్ట్రీలో కుర్ర హీరోల కంటే మంచి స్పీడ్ మీద సినిమాలు ఓకే చేస్తూ కంప్లీట్ చేస్తున్న హీరో మెగాస్టార్ చిరంజీవి. ఒకపక్క ఇండస్ట్రీ సమస్యలు తీరుస్తూనే మరోపక్క కెరియర్ పరంగా ఎక్కడ కూడా ఒప్పుకున్న సినిమాలకు ఆటంకం కలగకుండా దూసుకుపోతున్నారు. కరోనా కారణంగా ఆచార్య అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నా.. ఆ సినిమాని కంప్లీట్ చేస్తూనే మరోవైపు గాడ్ ఫాదర్ సినిమాని ముగింపు దశకు తీసుకొచ్చారు. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా… ఈ ఏడాది ద్వితీయార్థంలో ఆడియన్స్ ముందుకు రానుంది.
ఈ సినిమా అయిన వెంటనే మెహర్ రమేష్ దర్శకత్వంలో “బోలా శంకర్” సినిమాని సెట్స్ పైకి తీసుకు రానున్నారు. ఈ సినిమాలో చిరంజీవి సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. హీరోయిన్ కీర్తిసురేష్ కూడా కీలక పాత్ర పోషిస్తోంది. ఇక ఈ సినిమా అయిన వెంటనే మరో డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో చిరంజీవి సినిమా ఒప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కొత్త సినిమాకి సంబంధించి సరికొత్త టైటిల్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.
మాస్ కథ నేపథ్యంలో.. స్టోరీ ఉండబోతున్నటు దీంతో… చిరంజీవి క్యారెక్టర్ కి సంబంధించిన పేరునే టైటిల్ గా మార్చినట్లు టాక్. పూర్తి విషయంలోకి వెళితే “వాల్తేరు వీరయ్య” అనే టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం. విశాఖపట్టణం నేపథ్యంలో సినిమా స్టోరీ ఉంటుంది పోతున్నట్లు ఆ రీతిగా స్టోరీ లో చిరంజీవి మార్పులు చేసినట్లు… ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. టైటిల్ చాలా కొత్తగా ఉండటంతో సోషల్ మీడియాలో రావటంతో మెగా ఫ్యాన్స్.. మరో ఘరానా మొగుడు వాతావరణాన్ని చిరంజీవి మళ్లీ క్రియేట్ చేస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!