Vijay Deverakonda: రౌడీ విజయ్ దేవరకొండ వరుసపరాజయాలతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. విజయం వరించి కొన్ని సంవత్సరాలు అయిపోయింది. దాదాపు వరుసగా నాలుగు సినిమాలు అట్టర్ ప్లాప్ కావడంతో విజయ్ దేవరకొండ కెరియర్ పై చీకటి మేఘాలు కల్ముకున్నట్లు పరిస్థితి నెలకొంది. పైగా ఈ ఏడాది పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించిన “లైగర్” అట్టర్ ఫ్లాప్ కావటం అభిమానులను మరింత నిరాశపరిచింది. “లైగర్” పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం. ఈ సినిమా కోసం ఏకంగా రెండున్నర సంవత్సరాలు విజయ్ దేవరకొండ కష్టపడ్డాడు. కానీ సినిమా విడుదలైన మొదటి షోకే డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది.
ఇటువంటి పరిస్థితుల్లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేస్తున్న రెండో సినిమా జనగణమన షూటింగ్ .. ఒక షెడ్యూల్ కంప్లీట్ అయినా గాని షూటింగ్ ఆపేశారు. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం విజయ్ దేవరకొండ … శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో సుకుమార్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు. కాగా ఇప్పుడు మరో దర్శకుడును విజయ్ దేవరకొండ లైన్ లో పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.
“జెర్సీ” సినిమా దర్శకుడు గౌతమ్ తిన్నాను మరి దర్శకత్వంలో విజయ్ సినిమా చేయబోతున్నారట. వచ్చే ఏడాది ప్రారంభం నుండే ఈ సినిమా షూటింగ్ జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాని ఎన్వీ ప్రసాద్ నిర్మించనున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. విజయ్ దేవరకొండ కోసం చాలా వైవిధ్యమైన స్టోరీ గౌతం తిననూరి రెడీ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా వరుస పరాజయాల మీద ఉన్న రౌడీ విజయ్ ఒక సాలిడ్ హిట్ కోసం ఎంతో కృషి చేస్తున్నాడు.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!