Bunny Ramcharan: గతంలో వంశీపైడిపల్లి దర్శకత్వంలో బన్నీ- రామ్ చరణ్ లతో “ఎవడు” అనే సినిమా చేయటం తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఇద్దరు ఒకే ఫ్రేమ్ లో కనిపించిన షాట్ ఎక్కడా కనబడదు. కానీ సినిమా సూపర్ డూపర్ హిట్టయ్యింది. ఇదిలా ఉంటే ఇప్పుడు వీరిద్దరితో మల్టీ స్టారర్ సినిమా చేయడానికి ఓ ప్రముఖ డైరెక్టర్ రెడీ అయినట్లు ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్ నడుస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ వరకు.. మల్టీ స్టారర్ పర్వం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇటీవలే తారక్- ఎన్టీఆర్ కలసి నటించిన “RRR” తిరుగులేని విజయాన్ని అందుకున్నారు. రీసెంట్ గా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన “విక్రమ్” కూడా భారీ మల్టీస్టారర్ సినిమా. ఇది కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం థియేటర్ లో రికార్డు స్థాయి వసూళ్లు రాబడుతోంది. పరిస్థితి ఇలా ఉంటే లోకేష్ కనగరాజ్.. ఐకాన్ స్టార్ బన్నీ.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో.. కలిపి మల్టీస్టారర్ సినిమా ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్ నడుస్తోంది. ఇటీవలే లోకేష్ కనగరాజ్.. బన్నీతో స్క్రిప్ట్ కి సంబంధించి చర్చలు జరిపిన్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతకుముందే లోకేష్ కనగరాజ్ … చెర్రీతో డిస్కషన్ చేయడం జరిగింది.
ఈ విషయాన్ని లోకేష్ కనగరాజ్ కూడా తెలియజేయడం జరిగింది. సో ఇప్పుడు బన్నీతో లోకేష్ కనగరాజ్ డిస్కషన్ పెట్టడంతో..ఇది మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ అనే టాక్.. ఇండస్ట్రీ లో వినపడుతోంది.ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఇక బన్నీ సుకుమార్ దర్శకత్వంలో “పుష్ప” రెండవ భాగం చేయడానికి రెడీ అవుతున్నారు. అంతా కుదిరితే లోకేష్ కనగరాజ్ మూవీ..ఈ రెండు ప్రాజెక్టులు అయిన తర్వాత ఉండే అవకాశం ఉందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.