Hrithik Roshan: ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాలీవుడ్ పేరు మారుమ్రోగుతోంది. ఒకప్పుడు దక్షిణాది సినిమా రంగంలో అంటే చాలా చిన్నచూపు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ప్రపంచ సినిమా ప్రేమికులు ఎక్కువగా బాలీవుడ్ ఇండస్ట్రీ గురించి చెప్పుకునే వాళ్ళు. కానీ ఎప్పుడైతే టాలీవుడ్ జక్కన్న రాజమౌళి చెక్కిన బాహుబలి.. టాలీవుడ్ రూపురేఖలనే మార్చేసింది.
ఏకంగా దేశ ప్రధాని మోడీ తెలుగు చలన చిత్ర రంగం యొక్క గొప్పదనాన్ని ఇటీవల ప్రశ్నించడం జరిగింది. దీంతో తెలుగు సినిమా స్థాయి ఏవిధంగా పెరిగిందో చెప్పనవసరం లేదు. పరిస్థితి ఇలా ఉంటే బాలీవుడ్ ఇండస్ట్రీ ఇంకా అనేక ఇండస్ట్రీలకు చెందిన వాళ్ళు తెలుగు డైరెక్టర్లతో పని చేయడానికి ఎక్కువ ఇష్టపడుతున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా బాలీవుడ్ కండల వీరుడు హృతిక్ రోషన్ ఓ భారీ మల్టీస్టారర్ సినిమాకి అది కూడా తెలుగు డైరెక్టర్ చెప్పిన కథ కి ఓకే చెప్పినట్లు లేటెస్ట్ టాక్.
ఈ సినిమాలో మెగా కాంపౌండ్ హీరో వరుణ్ తేజ్ .. హృతిక్ రోషన్ తో స్క్రీన్ షేర్ చేసుకోనున్నట్లు సమాచారం. పూర్తి విషయంలోకి వెళ్తే పూరి.. ఇటీవల ఓ సినిమా స్టోరీ రుతిక్ రోషన్ కి చెప్పటం జరిగిందట. మొదట ఒప్పుకోక పోయినా దాని తర్వాత స్టోరీ లో మార్పులు చేయడంతో.. హృతిక్ ఓకే చెప్పినట్లు.. వరుణ్ తేజ్ తో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. జనగణమన ప్రాజెక్టు తర్వాత పూరి జగన్నాథ్ ఈ మల్టీ స్టారర్ సినిమా పట్టాలెక్కించనున్నట్లు సమాచారం.