Prabhas Salaar : బాహుబలి చిత్రం ద్వారా నేషనల్ వైడ్ గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా నటిస్తున్నారు. బాహుబలి సినిమా తర్వాత వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్న ప్రభాస్ ప్రస్తుతం కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం సలార్ చిత్రబృందం పెద్దపెల్లి జిల్లాలోని రామగుండంలో చిత్రం షూటింగ్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ అప్డేట్ చిత్ర బృందం తెలియజేశారు.
ప్రభాస్ హీరోగా పాన్ ఇండియా రూపంలో తెరకెక్కుతున్న సలార్ సినిమాలో హీరోయిన్ పాత్రలో నటించే అవకాశాన్ని శృతిహాసన్ దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలోనే శృతి హాసన్ తన పాత్రలో భాగంగా నేడు సలార్ సెట్ లో సందడి చేశారు. బైక్ మెకానిక్ షెడ్ బ్యాక్ డ్రాప్లో ప్రభాస్-శృతిహాసన్ పై వచ్చే సన్నివేశాలను ప్రశాంత్ నీల్ తెరకెక్కించినట్లు సమాచారం. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాకు ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరంగదూర్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
చాలా రోజుల విరామం తర్వాత తిరిగి సినిమాలలో నటిస్తున్న శృతిహాసన్ తాజాగా రవితేజ క్రాక్ సినిమాలో నటించారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రావడంతో సంచలన విజయం సాధించింది. దీంతో శృతి హాసన్ కు వరుస అవకాశాలు వెల్లువెత్తాయి. ఇందులో భాగంగానే సలార్ సినిమాలో ప్రభాస్ సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ బ్యూటీ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఈ అప్డేట్ తెలియడంతో ప్రేక్షకులు ఈ సినిమా ఏ కథ అంశంపై తెరకెక్కుతుందనే ఆలోచనలో పడ్డారు. ప్రభాస్ సలార్ చిత్రం కోసం 4 నెలల సమయం కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా తరువాత ప్రభాస్ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఆది పురుష్ చిత్రంలో నటించనున్నారు. ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన రాధేశ్యామ్ విడుదలకు సిద్ధంగా ఉంది.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!