Ram Charan- Upasana: మెగా ఫ్యామిలీలో డబుల్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. అందుకు కారణం మెగా పవర్ రామ్ చరణ్ మరియు ఆయన సతీమణి ఉపసానలే. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రామ్ చరణ్ నటించిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ చిత్రం `ఆర్ఆర్ఆర్`. దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా దాదాపు మూడేళ్లు శ్రమించిన తెరకెక్కించిన ఈ చిత్రం మార్చి 25న విడుదలై ఘన విజయం సాధించింది.
`వినయ విధేయ రామ` వంటి ఫ్లాప్ తర్వాత `ఆర్ఆర్ఆర్`తో బిగ్ హిట్ అందుకోవడంతో చరణ్ ఫుల్ ఖుషీ అయిపోతున్నాడు. ఇలాంటి తరుణంలో ఉపాసనకు అరుదైన గౌవరం దక్కింది. అపోలో హాస్పిటల్ వ్యవస్థాపకులు ప్రతాప్ సి. రెడ్డి మనవరాలు అయిన ఉపాసన గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు.
మెగా కోడలిగానే కాకుండా అపోలో లైఫ్కి వైస్ చైర్ పర్సన్గా, బీ పాజిటివ్ మ్యాగజైన్కు ఎడిటర్గా వ్యవహరిస్తూ సొసైటీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. అలాగే పలు సేవా కార్యక్రమాల ద్వారా కూడా ప్రజలకు దగ్గరైన ఉపాసన తాజాగా ప్రతిష్టాత్మక నాట్ హెల్త్ సీఎస్ఆర్ అవార్డ్ దక్కించుకుంది.
గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం అపోలో హాస్పిటల్స్ ఫౌండేషన్ చేస్తున్న కృషికి గుర్తింపుగా 2022 ఏడాదికి గాను ఆమె ఈ అవార్డును అందుకుంది. ఈ విషయాన్ని ఉపాసన సోషల్ మీడియా ద్వారా తెలుపుతూ ఆనందాన్ని వ్యక్తం చేసింది. చరణ్, ఉపాసనల సక్సెస్ నేపథ్యంలోనే మెగా ఫ్యామిలీలో డబుల్ సెటబ్రేషన్స్ జరుగుతున్నాయని అంటున్నారు.