Upasana: మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ప్రముఖ వ్యాపార వేత్త, అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి మనమరాలు అయిన ఉపాసన 2012లో చరణ్కు వివాహం చేసుకుని మెగా ఇంటికి కోడలు అయింది. ప్రస్తుతం ఈమె అపోలో హాస్పిటల్ కి సంబంధించిన మేనేజ్మెంట్ పనులను దగ్గరుండి చూసుకుంటున్నారు.
అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన మహిళా పారిశ్రామికవేత్తలలో ఒకరైనా ఉపాసన.. తాజాగా కరోనా బారిన పడి కోలుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమెనే సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. `మొత్తానికి కోలుకున్నాను.. మళ్లీ యుద్దం చేసేందుకు రెడీగా ఉన్నాను..
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
గత వారం నాకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. చెన్నైలో ఉన్న తాతయ్య, అమ్మమ్మల వద్దకు వెళ్లేందుకు కోవిడ్ టెస్ట్ చేయించుకున్నా. అప్పుడే కరోనా సోకిందన్న విషయం తెలిసింది. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపించాయి. దీంతో డాక్టర్స్ నన్ను కేవలం పారాసిటమల్, విటమిన్ టాబ్లెట్స్ మాత్రమే వాడమని సూచించారు.
కరోనా సోకడంతో బాడీ పెయిన్స్, జుట్టు ఊడిపోవడం, నీరసం వంటి సమస్యలు రావచ్చని కొందరు చెప్పారు. కానీ, నాకు అలాంటి సమస్యలు ఎదురు కాలేదు. అసలు టేస్ట్ చేయించుకోపోతే కరోనా సోకిందనే విషయం కూడా తెలిసేది కాదు` అని ఉపాసన పేర్కొంది. మొత్తానికి మెగా కరోనా బారిన పడినప్పటికీ త్వరగా కోలుకోవడంతో అభిమానులు హాపీగా ఫీల్ అవుతున్నారు.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!