Golden Globe Award: నిన్న లాస్ ఏంజెల్స్ లో ప్రపంచ సినిమా రంగంలో ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డు RRR గెలుచుకోవటం తెలిసిందే. నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ కేటగిరీలో అవార్డు రావడం జరిగింది. ఈ సందర్భంగా అంతర్జాతీయ వేదికపై సినిమా మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి అవార్డు అందుకున్నారు. దీంతో నిన్నటి నుండి సినిమా సెలబ్రిటీలు ప్రధాని మోడీ ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ నాయకులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సినిమా యూనిట్ కి పెద్ద ఎత్తున అభినందనలు తెలియజేయడం జరిగింది. భారతదేశాన్ని గర్వించేలా చేశారని చాలామంది కొనియాడారు.
అయితే తాజాగా రామ్ చరణ్ భార్య ఉపాసన RRR కి గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం పట్ల చాలా ఎమోషనల్ ట్వీట్ చేయడం జరిగింది. సినిమాకి అవార్డు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేసింది. RRR టీంలో భాగమైనందుకు ఆనందంగా ఉంది. దేశం గర్వించే విజయం ఇది. ఈ ప్రయాణంలో నేను భాగమయ్యేలా చేసినందుకు రామ్ చరణ్, దర్శకుడు రాజమౌళికి థాంక్యూ. నాతో కలిసి నా బేబీ కూడా ఈ అనుభూతిని పొందుతున్నందుకు ఆనందంగా ఉంది. ఈ క్షణాలు ఎంతో ప్రత్యేకమని ట్వీట్ చేయడం జరిగింది. గోల్డెన్ గ్లోబ్ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో రామ్ చరణ్ తో కలిసి ఉపాసన కూడా పాల్గొంది.
ఇంకా ఇదే రీతిలో ఆస్కార్ కూడా గెలవాలని సినీ ప్రేమికులు కోరుకుంటున్నారు. ఈ అవార్డుతో మొత్తం నాలుగు అంతర్జాతీయ సినీ అవార్డులు RRR గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ పాటకి 20 కోట్ల రూపాయల బడ్జెట్ ఖర్చు పెట్టడం జరిగిందని నిర్మాత దానయ్య చెప్పుకొచ్చారు. 30 రోజులపాటు రిహార్లు సరిగాయని హీరోని ఇద్దరు అన్ని రోజులు కష్టపడ్డారని ఈ ఫలితం అద్భుతంగా రావటంతో పాటు అవార్డు రావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.