Pawan Kalyan: టాలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగులేని క్రేజ్ ఉన్న హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్. బాక్సాఫీస్ వద్ద పవన్ కళ్యాణ్ సినిమా విడుదల అవుతుందంటే చాలు… పెద్ద సినిమాలు కూడా ఆగి పోవాల్సిందే. ఓపెనింగ్స్ రాబట్టడంలో పవన్ కళ్యాణ్ సినిమాల తీరే వేరు. కొన్ని సంవత్సరాల పాటు రాజకీయాల్లో ఉన్నాగాని సినిమాల పరంగా చెక్కుచెదరని క్రేజ్ పవన్ సొంతం. హీరోగా కంటే వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ ని చాలామంది ఇష్టపడుతుంటారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ కూడా సామాజికంగా బాధ్యతగా ఉంటూనే మరో పక్క సినిమాల పరంగా కూడా తనదైన శైలిలో రాణిస్తూ ఉంటారు. ఏమాత్రం సినిమా ఫీల్డ్ లో రాణించే సత్తా ఉంటే కచ్చితంగా పవన్ సపోర్ట్ చేస్తూ ఉంటారు.
అంతమాత్రమే కాదు ఇటీవల తన సొంత బ్యానర్ లో కూడా చిన్న సినిమాలు నిర్మించడానికి రెడీ అయినట్లు కూడా వార్తలు ఇండస్ట్రీలో వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ నెక్స్ట్ చేయబోయే సినిమాల విషయంలో ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు.. వార్తలు వస్తున్నాయి. మేటర్ లోకి సాగర్ కే చంద్ర దర్శకత్వంలో.. పవన్ నటించిన “బీమ్లా నాయక్” ఫిబ్రవరి నెలలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాలలో దాదాపు 200 కోట్ల మేర కలెక్షన్ ఈ సినిమా రాబట్టినట్లు వార్తలు వచ్చాయి. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ తనదైన శైలిలో నటించాడు.
అయితే ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ గా చేసిన రవి కే చంద్రన్… పవన్ కళ్యాణ్ ని చాలా అద్భుతంగా చూపించడం జరిగింది. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ మరోసారి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఓ సినిమాకి .. రికమండేషన్ చేసి మరి రవి కే చంద్రన్ నీ తీసుకున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో… హరిహర వీరమల్లు చేస్తున్నారు. ఇది అయిన వెంటనే హరీష్ శంకర్ దర్శకత్వంలో “భగత్ సింగ్ భవదీయుడు” అనే ప్రాజెక్ట్ చేస్తున్నారు. తర్వాత ఇంకా చాలామంది దర్శకులను పవన్ లైన్ లో పెట్టడం జరిగింది. దీంతో నెక్స్ట్ చేయబోయే ఓ కీలకమైన ప్రాజెక్టుకు సంబంధించి సినిమాటోగ్రఫీ కోసం రవి కే చంద్రన్ నీ పవన్ తీసుకున్నట్లు ఫిలింనగర్ టాక్.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!