ఈ మధ్య సినిమాలను దర్శక నిర్మాతలు పీరియాడిక్ బ్యాక్డ్రాప్లో యథార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు తొలి చిత్రంతోనే అలాంటి ప్రయత్నం చేస్తున్నాడు మెగా క్యాంప్ హీరో వైష్ణవ్ తేజ్. సాయిధరమ్ తేజ్ తమ్ముడైన వైష్ణవ్ తేజ్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ఓ సినిమాను నిర్మించబోతున్నారు. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈసినిమా ప్రధాన కథాంశం పరువు హత్యలే. చేపలు పట్టే హీరో.. గొప్పింటి హీరోయిన్ను ప్రేమిస్తే ఏమవుతుంది. రెండు కులాల మధ్య ఎలాంటి గొడవలు జరుగుతాయనేదే కథ. విజయ్ సేతుపతి ఇందులో విలన్గా నటించబోతున్నాడు.
previous post
next post