యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందిన చిత్రం `సాహో`. ఈ సినిమాను దేశంలోనే అతి పెద్ద సిల్వర్ స్క్రీన్పై ఆగస్ట్ 30న ప్రారంభించనున్నారు. ఈ థియేటర్తో పాటు మరో రెండు సాధారణ థియేటర్స్ ఉన్న మల్టీప్లెక్స్ విఎపిక్ను నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో నిర్మించారు. యు.వి.క్రియేషన్స్ నిర్మాతల్లో వేమారెడ్డి వంశీ ఈ థియేటర్ను నిర్మించారు .ఈ థియేటర్ను ఈరోజు మెగాపవర్ స్టార్ రామ్చరణ్ ప్రారంభించారు. 100 అడుగుల వెడల్పు, 54 అడుగుల పొడవున్నఈ థియేటర్ సామర్థ్యం 645. 3డీ సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్ ఇది. ఇలాంటి థియేటర్స్ ఆసియా ఖండంలో మరో రెండు మాత్రమే ఉన్నాయి. ప్రభాస్ సరసన బాలీవుడ్ నాయకి శ్రద్ధాకపూర్ హీరోయిన్గా నటించింది.
previous post
next post
Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!