Tollywood: టాలీవుడ్ స్టార్ హీరోలు గత కొన్నేళ్లలో తమ మార్కెట్ ను ఊహించని స్థాయిలో పెంచుకున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోలు ప్రస్తుతం ఒక్కో సినిమాకు భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ పాన్ ఇండియా హీరోలుగా సత్తా చాటాలని టాలీవుడ్ హీరోలు భావిస్తున్నారు. బాహుబలితో పాన్ ఇండియా హీరోగా హవా మొదలుపెట్టాడు ప్రభాస్. పుష్ప సినిమాతో బన్నీకి ఇప్పటికే పాన్ ఇండియా హీరోగా గుర్తింపు వచ్చింది. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్, చరణ్ లు పాన్ ఇండియా హీరోలు అయిపోయారు. మహేష్ రాజమౌళి కాంబో మూవీ కూడా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనుందని సమాచారం.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఖాళీగా స్టార్ హీరోలు..!
ఇదిలా ఉండగా స్టార్ హీరోలు పాన్ ఇండియా మార్కెట్ కోసం కథలపై దృష్టి సారించారు. అందుకే ఆచి తూచి అడుగేస్తున్నారు. మహేష్ బాబు – పవన్ కళ్యాణ్ – జూనియర్ ఎన్టీఆర్ – రామ్ చరణ్ – అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలు ఇప్పటికే పలు చిత్రాలకు కమిట్ అయ్యారు. వీరిలో కొందరు తమ చివరి సినిమాలతో బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించినప్పటికీ.. వెంటనే కొత్త ప్రాజెక్ట్స్ ని సెట్స్ మీదకు తీసుకెళ్లకపోవడం గమనార్హం. ఇలా టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరూ ప్రస్తుతం షూటింగుల్లో నిమగ్నమై లేరు. ఇలా ఎప్పుడో కానీ జరగదు. అయితే వచ్చే నెల నుంచి ఒక్కరొక్కరుగా తిరిగి సెట్స్ లో అడుగుపెట్టి బిజీగా మారిపోనున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఒకే లైన్ లో మహేష్.. ఎన్టీఆర్..చరణ్..బన్నీ
‘సర్కారు వారి పాట’ సినిమాతో ఇటీవలే సక్సెస్ అందుకున్న మహేష్.. ఈ నెలలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తారని అందరూ భావించారు. కానీ ఇప్పుడు జూలైలో మాత్రమే SSMB28 ని ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఇక ‘అరవింద సమేత’ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఈమధ్యనే ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. అయితే ఇంకా కొరటాల శివ దర్శకత్వంలో చేయాల్సిన తన తదుపరి చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లలేదు. ఈ ప్రాజెక్ట్ ను ఆగస్టులో మొదలు పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక ఆర్.ఆర్.ఆర్ తో భారీ విజయాన్ని అందుకున్న రామ్ చరణ్ వెంటనే ‘ఆచార్య’ తో డిజాస్టర్ అందుకున్నాడు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో చేస్తున్న RC15 సెట్స్ మీద ఉంది. కొన్ని తెలియని కారణాల వల్ల భోపాల్ షెడ్యూల్ ను రద్దు చేశారని టాక్. మరోవైపు అల్లు అర్జున్.. ఇంకా రెండో భాగం ‘పుష్ప: ది రూల్’ ను సెట్స్ పైకి తీసుకెళ్లలేదు. మార్చి లోనే షూటింగ్ మొదలు పెడతామని మేకర్స్ ప్రకటించారు కానీ.. ప్రీ ప్రొడక్షన్ మరియ స్క్రిప్టు మీద ఎక్కువ ఫోకస్ పెట్టడంతో ఆలస్యం అవుతోంది. సుకుమార్ ఈ ప్రాజెక్ట్ ను ఆగస్టులో ప్రారంభిస్తారని టాక్ వినిపిస్తోంది.