నటుడిగా ఎంట్రీ ఇచ్చిన వక్కంతం వంశీ.. తర్వాత స్టార్ రైటర్గా మారాడు. అయితే 2018లో డైరెక్టర్గా మారాడు. అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ తెరకెక్కించిన చిత్రం `నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా`… అనుకున్న మేర సక్సెస్ కాలేదు. దీంతో ఈయనకు తెలుగులో అవకాశాలు దక్కలేదు. అయితే వంశీ తదుపరి సినిమాను కన్నడంలో చేయాలనుకుంటున్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. కన్నడ స్టార్ హీరో దర్శన్తో సినిమా చేయాలనుకుంటున్నాడట వంశీ. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి ఓ క్లారిటీ రానుందని వార్తలు వినపడుతున్నాయి.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!