Kajal Aggarwal: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో చేతినిండా సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్న వారిలో నటి కాజల్ అగర్వాల్ ఒకరు అని చెప్పవచ్చు.పెళ్లి తర్వాత కూడా ఈ చందమామకు ఏ మాత్రం అవకాశాలు తగ్గకుండా వరుస సినిమాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తూన్నారు. పెళ్లి అయిన తర్వాత వివాహ జీవితంలో ఎంజాయ్ చేస్తూ, మరోవైపు సినిమాల్లో నటిస్తూ రెండింటిని ఎంతో బ్యాలెన్స్ చేస్తున్నారు. పెళ్లయిన తర్వాత వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న కాజల్ ప్రస్తుతం తాను ఒప్పుకున్న సినిమాలలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే కాజల్ అగర్వాల్ మెగాస్టార్ చిరంజీవి సరసన ఆచార్య సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు.
కాజల్ అగర్వాల్ ఇదివరకే చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమాలో నటించి సందడి చేశారు. ప్రస్తుతం ఆచార్య సినిమాలో కూడా కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు.అదే విధంగా మంచు విష్ణుతో కలిసి మోసగాళ్లు చిత్రంలో నటించిన కాజల్ ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా హైదరాబాద్ వచ్చారు.ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉన్న కాజల్ అగర్వాల్ తన వ్యక్తిగత విషయాల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఇందులో భాగంగానే కాజల్ జీవితంలో ఇద్దరు వ్యక్తులను చూస్తే మాత్రం కొట్టాలనిపిస్తుంది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తనని తాను మార్చుకుంటున్న కాజల్ అగర్వాల్:
కాజల్ అగర్వాల్ జీవితంలో రెండు రకాల మనుషులను చూస్తే మాత్రం ఒళ్లుమండిపోతుందని చెప్పారు. ఇందులో ఇతరులకు అబద్ధాలు చెప్పే వారంటే తనకి నచ్చదని, అలాంటి వారు కనిపించినప్పుడు లాగి కొట్టాలనిపిస్తుంది. తన అనుకున్న వాళ్ల దగ్గర అబద్ధాలు చెప్పి వారిని మోసం చేసేవారు అంటే తనకు చాలా కోపమని తెలిపారు. అదే విధంగా మోసం చేసే వాళ్ళు అన్న కూడా తనకు నచ్చరని, ఇలాంటి వాళ్ళని అంత తొందరగా క్షమించనని తెలిపారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో తన చుట్టూ ఉండే వాళ్ళు తనకు ఏ విషయంలోనూ అబద్ధం చెప్పరని, అలా అబద్ధాలు చెప్పే వారిని తన ఎంకరేజ్ చేయనని తెలియజేశారు. దీన్నిబట్టి చూస్తే ఈ చందమామకు కోపం తెప్పించాలంటే కేవలం ఒక్క అబద్ధమాడితే చాలు అని తెలుస్తోంది. పెళ్లయిన తర్వాత కాజల్ అగర్వాల్ తనను తాను ఎంతో మార్చుకుంటున్నానని, ప్రస్తుతం ఈ విధంగా మోసం చేసే వాళ్ళు, అబద్ధాలు చెప్పే వాళ్ళు ఎదురుపడిన వారిపై కోపం ప్రదర్శించకుండా, ప్రశాంతంగా కంట్రోల్ చేసుకుంటున్నానని ఈ సందర్భంగా కాజల్ అగర్వాల్ తెలిపారు.