Vamsi Mahesh: సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస విజయాలతో ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. “భరత్ అనే నేను” మొదలుకొని “మహర్షి”, “సరిలేరు నీకెవ్వరు” సినిమాలతో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ అందుకున్న మహేష్ తాజాగా “సర్కారు వారి పాట”తో మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకోవడం తెలిసిందే. ఇదిలా ఉంటే సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత.. మహేష్ బాబు .. వంశీ పైడిపల్లితో సినిమా చేస్తున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇదే విషయాన్ని వంశీ “సరిలేరు నీకెవ్వరు” ఫ్రీ రిలీజ్ వేడుకలో కూడా తెలియజేశారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అయితే అనుకోకుండా ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవటం తెలిసిందే. స్టోరీలో మార్పులు చేర్పులు చేసిన గాని మహేష్ నో చెప్పేసి పరశురామ్ చెప్పిన “సర్కారు వారి పాట”.. ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంతో అప్పటి నుండి వంశీ పైడిపల్లి ప్రాజెక్ట్ మహేష్ ఎందుకు.. క్యాన్సిల్ చేశాడు అన్నది జవాబు దొరకని ప్రశ్నగా మిగిలిపోవడం తెలిసిందే. ఈ తరుణంలో మహేష్.. వంశీ పైడిపల్లి ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేయడానికి గల కారణం ఏంటో ఇటీవల బయటపడింది.
ప్రస్తుతం వంశీ పైడిపల్లి తమిళ స్టార్ హీరో విజయ్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఏ సినిమా షూటింగ్ హైదరాబాద్లో కూడా శరవేగంగా జరుగుతోంది. ఇక విషయంలోకి వెళితే మహేష్ నో చెప్పిన స్టోరీ తోనే వంశీ పైడిపల్లి.. విజయ్ తో సినిమా చేస్తున్నట్లు టాక్ బయటకు వచ్చింది. డాక్టర్ లోకి వెళ్తే ఈ స్టోరీ డబల్ రోల్ కథ కావడంతో మహేష్… డ్యూయల్ రోల్ సినిమాలు చేసే ఇంట్రెస్ట్ లేకపోవడం తో వంశీ పైడిపల్లి ప్రాజెక్టు క్యాన్సల్ చేయడం జరిగిందట. ఇక ఇదే తరుణంలో డ్యూయల్ రోల్ చేయాలని ఎప్పటి నుండో విజయ్ ఎదురు చూస్తూ ఉండటం తో.. వంశీ పైడిపల్లి చెప్పిన స్టోరీ విన్న వెంటనే ఒప్పుకున్నట్లు లేటెస్ట్ టాక్ బయటకు వచ్చింది. డ్యూయల్ రోల్ కారణంగానే వంశీ పైడిపల్లి ప్రాజెక్ట్ మహేష్ పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో నెక్స్ట్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!