నిన్న విజయవాడలో తాను నిర్వహించాల్సిన ప్రెస్మీట్ను ఏపీ పోలీసులు భద్రత కారణంగా చూపి అడ్డుకోవడం..తనను విజయవాడ నుండి బలవంతంగా పంపేయడంపై వర్మ హైదరాబాద్లో ప్రెస్మీట్ను నిర్వహించారు. ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందని.. శాంతి భద్రతల సమస్యలు తలెత్తేలా ఉందని అధికారులు పెర్కొన్నారని వర్మ తెలిపారు. “నేనేదో టెర్రరిస్టు అన్నట్లు ఏపీ పోలీసులు ప్రవర్తించాను. విజయవాడలో ప్రెస్మీట్ను నిర్వహించకపోవడం దారుణం. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను పక్కన పెడితే నాకు పెద్ద అవమానమే జరిగింది. లక్ష్మీస్ ఎన్టీఆర్ ఇప్పటికే విడుదలైంది. తాను కొత్తగా ఏం మాట్లాడుతానో అని అందరూ భయపడుతున్నారు. నన్ను ఏపీకి రావొద్దని అంటున్నారు. ఇదేమైనా నార్త్ కొరియానా? వీసా తీసుకోవాలా? ఏంటి?“ అంటూ ప్రశ్నించారు వర్మ.
వర్మ దర్శక నిర్మాణంలో రూపొందిన లక్ష్మీస్ ఎన్టీఆర్ మే 1న ఆంధ్రప్రదేశ్లో విడుదల కానుంది. ఏపీ మినహా అన్నీ చోట్ల మార్చి 29నే విడుదలైంది.
previous post
next post
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!