Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చాలా వైవిధ్యమైన సినిమాలు చేస్తూ అలరిస్తూ ఉన్నాడు. ఒకే రకమైన సినిమాలు చేయకుండా.. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే రీతిలో స్క్రిప్ట్ లు సెలెక్ట్ చేసుకుని రాణిస్తున్నారు. సోలోగా మాత్రమే కాదు మల్టీస్టారర్ సినిమాలకు కూడా ఓకే చెబుతూ ఎక్కడా కూడా ఈగోకి వెళ్లకుండా ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ అందించే దిశగా విజయవంతంగా రాణిస్తున్నాడు. ఇదిలా ఉంటే దీపావళి నేపథ్యంలో వరుణ్ తేజ్ పెద్ద మనసు చాటుకున్నాడు. దీపావళి సందర్భంగా హైదరాబాద్ లోని డెన్వర్ బ్లైండ్ స్కూల్ విద్యార్థులకు సర్ప్రైజ్ గిఫ్ట్ లు అందించడం జరిగింది. డెన్వర్ బ్లైండ్ స్కూల్ విద్యార్థుల అందరికీ టపాకాయలతో పాటు ప్రత్యేకమైన భోజన ఏర్పాట్లు చేశాడు.
రకరకాల ప్రత్యేకమైన వంటకాలతో… ఆ బ్లైండ్ పిల్లలందరికీ భోజనాలు పెట్టడం జరిగింది. ఇదే సమయంలో టపాకాయలతో పాటు బహుమతులు కూడా అందించడం జరిగింది. లోకం చూడని ఆ పిల్లలు వరుణ్ తేజ్ ఇచ్చిన సర్ప్రైజ్ కి ఆనందంతో ఉప్పొంగిపోయారు. ఈ క్రమంలో పిల్లల ముఖాల్లో సంతోషం నింపే అవకాశం రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నట్లు వరుణ్ తేజ్ ట్విట్టర్ ద్వారా తెలియజేయడం జరిగింది. దీపావళి పండుగ నేపథ్యంలో చాలామంది హీరోలు తమ ఇళ్లల్లో వేడుకలు జరుపుకుంటుంటే.. వరుణ్ ఈ రీతిగా.. అంధుల పాఠశాలకు సర్ప్రైజ్ బహుమతులతో పాటు భోజనాలు ఏర్పాటు చేయటం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఏడాది ప్రారంభంలో “గని”తో ప్రేక్షకులను పలకరించిన వరుణ్ తేజ్ పెద్దగా అల్లరించలేకపోయాడు. కానీ సినిమాతో మంచి విజయం అందుకోవటం జరిగింది. ప్రస్తుతం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో ఓ యదార్థమైన సంఘటన ఆధారంగా కొత్త దర్శకుడుతో వరుణ్ సినిమా చేయడానికి రెడీ అయ్యారు. అంతేకాదు “ది గోస్ట్” డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో కూడా సినిమా చేయనున్నారు. ఇదిలా ఉంటే తమకి బహుమతులు అందివటంతో.. బ్లైండ్ పాఠశాలల పిల్లలు వరుణ్ తేజ్ కి థాంక్స్ చెప్పడం జరిగింది.