ఆగస్టు 22 మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు కావడంతో రెండు తెలుగు రాష్ట్రాలలో మెగా ఫ్యాన్స్ భారీ ఎత్తున వేడుకలు చేయడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాల కాలంలో కరోనా కారణంగా పరిస్థితులు అనుకూలించక పోవడంతో పెద్దగా వేడుకలు చేయలేదు. అయితే ఈసారి సాధారణ పరిస్థితులు నెలకొనడంతో పాటు కరోనా ప్రభావం పెద్దగా లేకపోవడంతో ఈ జన్మదిన వేడుక గట్టిగా ప్లాన్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా హైదరాబాద్ హైటెక్స్ లో మెగా కార్నివాల్ ఆగష్టు 21వ తారీకు నాడు ఆదివారం నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ మినహా మిగతా మెగా హీరోలంతా హాజరవుతున్నారు. ఇటువంటి తరుణంలో మెగాస్టార్ చిరంజీవి బర్త్డే వేడుకలకు సంబంధించి కామన్ డిపి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ విడుదల చేయడం జరిగింది. దీంతో ఈ ఫోటోని మెగా ఫాన్స్ సోషల్ మీడియాలో తెగ షేర్ లు చేస్తున్నారు. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ .. ఇంతటి భాగ్యాన్ని కల్పించినందుకు ఎంతగానో కృతజ్ఞతలు. ఎంతో గౌరవంగా భావిస్తున్నాను అంటూ..చిరంజీవి బర్త్ డే వేడుకలకు సంబంధించి కామన్ డీపీ విడుదల చేస్తూ..కామెంట్ పెట్టడం జరిగింది.
ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి బర్త్డే నాడు ఆయన నటిస్తున్న మూడు సినిమాలకు సంబంధించి సరికొత్త అప్ డేట్ రానున్నట్లు సమాచారం. అనేటికంటే ముందే ఈరోజు సాయంత్రం “గాడ్ ఫాదర్” మూవీకి సంబంధించి రిలీజ్ డేట్ తో పాటు వీడియో కూడా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా ఈసారి చిరంజీవి బర్త్డే వేడుకలు భారీ ఎత్తున మెగా అభిమానులతో పాటు మెగా హీరోలు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!