కమర్షియల్ చిత్రాలను తెరకెక్కించడంలో స్పెషలిస్ట్ డైరెక్టర్ హరీశ్ శంకర్. ఈయన ప్రస్తుతం తమిళంలో విజయవంతమైన `జిగర్తండా` చిత్రాన్ని తెలుగులో `వాల్మీకి` పేరుతో రీమేక్ చేస్తున్నారు. వరుణ్తేజ్, అధర్వ మురళి, పూజా హెగ్డే, మృణాళిని రవి ప్రధాన పాత్రధారులు. ఇప్పటికే విడుదలైన వరుణ్ తేజ్ లుక్కి ఆడియెన్స్ నుండి ట్రెమండెస్ రెస్పాన్స్ వచ్చింది. లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమాకు హరీశ్ శంకర్ ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోవడం లేదట. వచ్చే కలెక్షన్స్ నుండి కొంత శాతం వాటాను కోరాడట. నిర్మాతలు కూడా సరే అన్నారట. ఈ చిత్రం సెప్టెంబర్ 13న విడుదల కానుంది.
previous post
next post