మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తోన్న చిత్రం `వాల్మీకి`. హరీష్ శంకర్ దర్శకుడు. తమిళ చిత్రం `జిగర్ తండా`కు ఇది రీమేక్. పూజా హెగ్డే ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తుంది. త్వరలోనే ఈమె సెట్స్లో జాయిన్కానుంది. ప్రస్తుతం చిత్రీకరణ హైదరాబాద్లో జరుగుతుంది. తమిళంలో బాబీ సింహ చేసిన గ్యాంగ్స్టర్ పాత్రలో వరుణ్ తేజ్ నటిస్తున్నారు. కాగా.. సిద్ధార్థ్ చేసిన అసిస్టెంట్ డైరెక్టర్ పాత్రలో తమిళ నటుడు అధర్వ మురళి నటిస్తున్నాడు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను సెప్టెంబర్ 6న విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
previous post
next post